News November 21, 2024
ఘోరం: కుటుంబమంతా ఆత్మహత్య

AP: అనంతపురం జిల్లా నార్పలలో ఒకే కుటుంబంలోని ముగ్గురు <<14669649>>ఉరేసుకొని<<>> ఆత్మహత్యకు పాల్పడ్డారు. నార్పలకు చెందిన కృష్ణ కిషోర్ (45) మెడికల్ స్టోర్ నిర్వహించేవారు. ఏ కష్టమొచ్చిందేమో కానీ భార్య శిరీష (35), 6 నెలల కుమారుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News January 29, 2026
రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్ను షాక్కు గురిచేసిన ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ కొత్త జర్నీ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సాగిన ప్రయాణానికి పూర్తి భిన్నమైన రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. WBకు చెందిన ఆయన కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు సన్నిహిత వర్గాలను పేర్కొంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోరని సమాచారం.
News January 29, 2026
ఏ దేవుళ్లకు ఏయే పుష్పాలు సమర్పించాలంటే?

విష్ణువుకు తులసి దళాలు ప్రీతికరం. మహాలక్ష్మికి తామరలు, ఎర్రని పూలు ఎంతో ఇష్టం. శివుడిని మారేడు దళాలతో పూజించాలి. సూర్యుడు, గణపతిని తెల్లజిల్లేడు పూలతో పూజిస్తే మంచి జరుగుతుంది. గాయత్రీ దేవికి మల్లె, మందార, కదంబ పుష్పాలు ఇష్టం. పూజకు వాడే పూలు తాజాగా, శుచిగా ఉండాలి. వాసన చూసినవి లేదా నేల రాలినవి వాడకూడదు. ఇలా ఇష్టమైన పూలతో దైవాన్ని అర్చిస్తే కోరిన కోరికలు నెరవేరి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
News January 29, 2026
‘బంగారంతో బీ కేర్ఫుల్’ వార్తల్లో నిజం లేదు: సజ్జనార్

TG: బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్లు పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్లో మకాం వేశాయని SMలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని CP సజ్జనార్ తెలిపారు. అలాంటి పోస్టులను షేర్ చేయొద్దని సూచించారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ పూర్తిగా సురక్షితమని హామీ ఇచ్చారు. అనుమానం వస్తే 100కు కాల్ చేసి శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.


