News September 1, 2025

‘ఆరోగ్యశ్రీ’ బిల్లులపై నేడు ప్రభుత్వంతో ఆస్పత్రుల చర్చలు!

image

TG: ‘ఆరోగ్యశ్రీ’ సేవలను <<17569217>>నిలిపివేయాలన్న<<>> నిర్ణయాన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులు వాయిదా వేశాయి. ప్రభుత్వం ఇవాళ చర్చలకు పిలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. చర్చల అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపాయి. పెండింగ్‌లో ఉన్న ₹1400 కోట్ల బిల్లులు చెల్లించాలని, లేదంటే సెప్టెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రులు ఇటీవల సర్కార్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

Similar News

News September 23, 2025

ఆర్టీసీ ఉద్యోగులకు దసరా అడ్వాన్స్: సజ్జనార్

image

TG: ఆర్టీసీ ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఉద్యోగుల హోదా, నెల జీతం ఆధారంగా అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరిగి వారి జీతం నుంచి నెలకు కొంత మొత్తంలో వసూలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు అధికారులతో సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అడ్వాన్స్ చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News September 23, 2025

వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

image

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News September 23, 2025

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్‌లో భారీ వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.