News March 28, 2025

బాబోయ్ ఎండలు.. రేపు 223 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. కమలాపురం, తాటిచెర్లలో 42.6, ఆలమూరులో 42.5, వెంకటగిరిలో 42.2, రావికమతంలో 42.1, వతలూరులో 42 డిగ్రీలు నమోదయ్యాయని తెలిపింది. రేపు 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, 223 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

Similar News

News March 31, 2025

1 కాదు, 2 కాదు.. 10 ప్రభుత్వ ఉద్యోగాలు

image

TG: ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టం అవుతున్న ఈ రోజుల్లో భూపాలపల్లి (D) గుంటూరుపల్లికి చెందిన V. గోపీకృష్ణ 10 ఉద్యోగాలు సాధించారు. తాజాగా, TGPSC రిలీజ్ చేసిన గ్రూప్-1 ఫలితాల్లో 70వ ర్యాంకర్‌గా నిలిచారు. ఈయన ఇప్పటి వరకు 7 కేంద్ర, 3 రాష్ట్ర ప్రభుత్వ కొలువులు సాధించారు. ప్రస్తుతం గోపి మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌‌గా ట్రైనింగ్ పొందుతున్నారు. త్వరలో గ్రూప్-1 పోస్టులో జాయిన్ అవుతానని చెప్పారు.

News March 31, 2025

‘ghibli’ ట్రెండ్

image

దేశంలో ఇప్పుడిదే నడుస్తోంది. ఎవరి SM పేజీలు చూసినా ‘ghibli’ ఎడిటెడ్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్‌లో ఈ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. మనవాళ్ల వాడకం ఎలా ఉందంటే.. ‘ghibli’ వినియోగాన్ని తగ్గించండి మహాప్రభో అంటూ ఏకంగా Open AI CEO ఆల్ట్‌మనే ప్రాధేయపడుతున్నారు. తమ సిబ్బంది నిద్ర లేకుండా పనిచేస్తున్నారని చెబుతున్నారు. మరి మీరూ ‘ghibli’ ట్రెండ్‌లో జాయిన్ అయ్యారా?

News March 31, 2025

వేసవిలో ఇలా చేయండి..

image

వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. వివిధ కారణాలతో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 8 గ్లాసుల వాటర్ తాగడం, దోసకాయ, పుచ్చకాయ తినడం, జ్యూస్‌లు తాగడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. దాహం వేయకున్నా తరచుగా నీరు తాగాలని చెబుతున్నారు. చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!