News January 25, 2025

ఫిబ్రవరి 1న ఇళ్ల పంపిణీ: మంత్రి

image

AP: PMAY కింద మార్చిలోపు 7 లక్షల ఇళ్లు నిర్మించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. రెండో విడతలో 6 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఫిబ్రవరి 1న ప.గో జిల్లా తణుకు(M) తేతలిలో సీఎం చంద్రబాబు ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తామని పేర్కొన్నారు.

Similar News

News October 25, 2025

స్లీప్ బ్యాంకింగ్.. నిద్రను దాచుకోండి!

image

పని లేనప్పుడు ఎక్కువ గంటలు నిద్రపోవడం, పని ఉన్నప్పుడు తక్కువ గంటలు నిద్రపోవడాన్నే ‘స్లీప్ బ్యాంకింగ్’ అంటారు. ఉదాహరణకు ఫలానా రోజు మీకు ఆఫీస్ అవర్స్ ఎక్కువ ఉన్నట్లు తెలిస్తే 3-7 రోజుల ముందే నిత్యం 2-3 గంటలు అధికంగా నిద్రపోవాలి. దీంతో వర్క్ అధికంగా ఉన్నా నిద్రకు ఎలాంటి ఇబ్బంది కలగదని అధ్యయనంలో తేలింది. అలాగే పసిపిల్లల తల్లులు కూడా సమయం దొరికినప్పుడు ఒక న్యాప్ వేస్తేనే అలసట దరిచేరదట.

News October 25, 2025

108, 104 సేవల్లో రూ.2 వేలకోట్ల స్కామ్: YCP

image

AP: 108, 104 సేవలను ప్రభుత్వం డబ్బు సంపాదనకు వాడుకుంటోందని YCP ఆరోపించింది. అంబులెన్స్ సేవల కాంట్రాక్ట్ ఎలాంటి అనుభవంలేని భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ Ltdకు అప్పగించడాన్ని తప్పుబట్టింది. TDP నేత డా.పవన్ కుమార్‌ ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారని, ఇందులో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేసింది. ఈ కాంట్రాక్ట్‌తో TDP నెలకు రూ.31 కోట్ల మామూళ్లు తీసుకుంటోందని విడదల రజిని ట్వీట్ చేశారు.

News October 25, 2025

జైళ్ల నుంచి ఉగ్ర, హత్య కుట్రలపై కేంద్రం అప్రమత్తం

image

జైళ్ల నుంచి ఉగ్ర, హత్య కుట్రలు చేస్తున్న టెర్రరిస్టు-గ్యాంగ్‌స్టర్ నెట్వర్క్‌ను విచ్ఛిన్నం చేసేలా ప్రణాళికను రూపొందించాలని అన్ని భద్రతా ఏజెన్సీలకు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలిచ్చింది. ఇటీవల జరిగిన కొన్ని హత్యలపై 53చోట్ల NIA చేసిన సోదాల్లో జైళ్ల నుంచి ఆర్గనైజ్డ్ నెట్వర్కు నడుస్తున్నట్లు తేలడంతో చర్యలు చేపట్టింది. రాష్ట్రాల పోలీసుల సహకారంతో అత్యంత ప్రమాదకారుల్ని గుర్తించి వారిని ఇతర జైళ్లకు తరలించనుంది.