News April 8, 2025
పరామర్శకు వచ్చి జేజేలా?.. జగన్పై సునీత ఫైర్

AP: పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా మాజీ CM జగన్కు తెలియదని TDP MLA పరిటాల సునీత ఎద్దేవా చేశారు. జై జగన్ అంటూ పరామర్శకు వెళ్తారా అని ఆమె ప్రశ్నించారు. ‘పరిటాల కుటుంబాన్ని రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడుతున్నారు. పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడటం ఏంటి? జగన్ ఒక MLA మాత్రమే. ఒక DSP, 10 మంది పోలీసులు ఆయన పర్యటనకు సరిపోతారు. వైసీపీ నేత లింగమయ్య హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News April 17, 2025
రాజీవ్ యువ వికాసం.. రెండు దశల్లో డబ్బులు

TG: రాజీవ్ యువ వికాసం కింద ప్రభుత్వం అందించే సబ్సిడీని రెండు దశల్లో విడుదల చేయనున్నట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పథకం మంజూరయ్యాక కొంత మొత్తం, స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తాన్ని రిలీజ్ చేస్తామన్నారు. లబ్ధిదారులకు 3-15 రోజులపాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద రాయితీతో రూ.50వేల నుంచి రూ.4 లక్షల వరకూ సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.
News April 17, 2025
పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని CS, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, DGPలను ఆదేశించింది. ప్రవీణ్ మృతిపై దర్యాప్తును CBIకి అప్పగించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ప్రవీణ్ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని పాల్ ఆరోపిస్తున్నారు.
News April 17, 2025
విదేశీ విద్యపై విద్యార్థులకు తగ్గుతున్న ఆసక్తి!

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఐదేళ్లలో తొలిసారి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలకు వెళ్లే స్టూడెంట్స్ వీసాల్లో మొత్తం 25% తగ్గుదల కనిపించింది. అమెరికాకు వెళ్లేవారిలో 34%, బ్రిటన్కు 26%, కెనడాకు 32% మంది విద్యార్థులు తగ్గుముఖం పట్టారు. ఆయా దేశాల్లో నిబంధనలు కఠినతరం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.