News August 15, 2024

భోజనం ఎలా చేస్తున్నారు?

image

ప్రస్తుతం నేలపై కూర్చుని తినేవారు తక్కువమందే ఉంటారు. కింద కూర్చుని తినడం వల్ల చాలా లాభాలున్నాయని నిపుణులు అంటున్నారు. కూర్చుని తినడం వల్ల కండరాల్లో కదలిక పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. నేలపై ప్లేట్ పెట్టుకుని తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బాసింపట్టు వేసుకుని తినడం వల్ల శారీరక నొప్పులు దూరమవుతాయి. ఇలా చేయడం వల్ల బరువు కూడా తగ్గుతారు. అందరూ కలిసి కూర్చుని తింటే కుటుంబసభ్యుల మధ్య బంధాలు బలపడుతాయి.

Similar News

News October 15, 2025

ప్రముఖ సింగర్ బాలసరస్వతి కన్నుమూత

image

తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన రావు బాలసరస్వతి(97) తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1928లో జన్మించిన ఆమె ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. ‘సతీ అనసూయ’ చిత్రంలో తొలి పాట పాడారు. ఆరేళ్ల వయసు నుంచే పాడటం మొదలెట్టిన బాలసరస్వతి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 2 వేలకు పైగా పాటలు ఆలపించారు. పలు సినిమాల్లో నటించారు.

News October 15, 2025

పాదాలు తెల్లగా అవ్వాలంటే..

image

చాలామంది ఇతర శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ పాదాలపై పెట్టరు. దీంతో ఇవి దీర్ఘకాలంలో నల్లగా మారిపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు చర్మ నిపుణులు. కాళ్లను క్లీన్ చేశాక తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్‌ రాయాలి. బయటకు వెళ్లేటపుడు సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి. లాక్టిక్‌ యాసిడ్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ C, హైడ్రోక్వినోన్‌లున్న లైటెనింగ్‌ క్రీములు వాడాలని సూచిస్తున్నారు.

News October 15, 2025

దారులు వేరైనప్పుడు KCR ఫొటో పెట్టుకోవడం కరెక్ట్ కాదు: కవిత

image

TG: కేసీఆర్ ఫొటో లేకుండానే ‘జాగృతి జనం బాట’ చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు. ‘ఆయన కడుపున పుట్టడం జన్మజన్మల అదృష్టం. కానీ దారులు వేరవుతున్నప్పుడు ఇంకా KCR పేరు చెప్పుకోవడం నైతికంగా కరెక్ట్ కాదు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. నేను వేరే తొవ్వ వెతుక్కుంటున్నా. గతంలో జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫొటో పెట్టకుండా జయశంకర్ ఫొటోనే పెట్టాం’ అని చెప్పారు.