News October 19, 2025

రాశులను ఎలా నిర్ణయిస్తారు?

image

వ్యక్తి పుట్టిన సమయం, ప్రదేశం ఆధారంగా రాశులను నిర్ణయిస్తారు. ఆ జన్మించిన సమయానికి ఆకాశంలో చంద్రుడు ఉన్న రాశినే వారి జన్మ రాశిగా పరిగణిస్తారు. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది వారి జన్మ నక్షత్రం అవుతుంది. పుట్టిన సమయానికి తూర్పున ఉదయించే రాశిని జన్మ లగ్నంగా వ్యవహరిస్తారు. జన్మ రాశి, నక్షత్రాల ఆధారంగానే జాతక ఫలితాలు నిర్ణయమవుతాయి.
☞ రోజువారీ మీ రాశిఫలాలను జ్యోతిషం <<-se_10008>>కేటగిరీకి<<>> వెళ్లి చూడొచ్చు.

Similar News

News February 9, 2026

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశా వర్కర్ పోస్టులు

image

<>AP:<<>> పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 14 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన మహిళలు ఫిబ్రవరి 20వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ప్రొవిజినల్ లిస్ట్‌ను ఫిబ్రవరి 23న ప్రకటిస్తారు. వయసు 25నుంచి 45 ఏళ్ల మధ్య ఉండి, స్థానికంగా నివాసం ఉండాలి. వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/

News February 9, 2026

అంధత్వాన్ని జయించి.. కేరళలో తొలి జడ్జిగా

image

‘సంకల్పం ముందు వైకల్యం ఎంత?’ అని నిరూపించారు కేరళకు చెందిన సి.తాన్యా నాథన్. అంధురాలైన తాన్యా కేరళలో తొలి అంధ మహిళా జడ్జిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఇటీవల జరిగిన జుడీషియల్ సర్వీస్ పరీక్షలో దివ్యాంగుల కేటగిరీలో ఆమె ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులూ న్యాయ వ్యవస్థలో విధుల నిర్వహణకు అర్హులని గతేడాది SC ఇచ్చిన తీర్పు ఆమె కలను నిజం చేసింది. బ్రెయిలీ లిపిలో ఆమె లా చదువుకున్నారు.

News February 9, 2026

ఎంత పడుకున్నా అలసట తీరట్లేదా?

image

రాత్రిళ్లు హాయిగా పడుకున్నా ఉదయం నిద్ర మత్తుగా ఉండటానికి విటమిన్ డీ లోపమే కారణమంటున్నారు నిపుణులు. ఇది మూడ్, శక్తిని నియంత్రించే సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. మధ్యాహ్నం సమయంలో శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి సహజంగా తగ్గుతుంది. ఇలాంటప్పుడు విటమిన్ D లోపం ఉంటే నీరసం, నిద్ర వచ్చినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి విటమిన్ D సప్లిమెంట్స్, సమతుల్య ఆహారం తీసుకోవాలి.