News September 4, 2024

రోజుకో అరటిపండు తింటే ఎంత లాభమో!

image

రోజుకో అరటిపండు తిన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. సూపర్‌ ఫ్రూట్‌గా పిలిచే అరటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచి శరీరానికి కావాల్సిన శక్తి అందేలా చేస్తుంది. మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గుండెకు మేలు చేస్తుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గించి డయాబెటిస్ రోగులకు సహాయపడుతుంది. చర్మాన్ని సంరక్షించడంతో పాటు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

Similar News

News December 26, 2025

ఆఫీసు కుర్చీలో నిద్రపోవడం అశుభమా?

image

ఆఫీసు కుర్చీని సింహాసనంలా భావించాలని పండితులు చెబుతున్నారు. విధి నిర్వహణలో ఆ కుర్చీపై నిద్రించడం తగదంటున్నారు. ‘ఇది వృత్తి పట్ల అగౌరవాన్ని సూచిస్తుంది. అలాగే ఆర్థిక నష్టాలు, అశుభ ఫలితాలను కలిగించే అవకాశముంది. ఇది ప్రగతిని అడ్డుకుని ప్రతికూల శక్తిని పెంచవచ్చు. మీకు అలసటగా ఉంటే నడవడం, ముఖం కడుక్కోవడం, విశ్రాంతి గదిలో రెస్ట్ తీసుకోవడం చేయాలి. కుర్చీలో నిద్రించడం కెరీర్‌కు మంచిది కాదు’ అంటున్నారు.

News December 26, 2025

వైకల్యం బారిన పడ్డ RTC ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

AP: సర్వీసులో వైకల్యం బారిన పడిన RTC ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగం లేదా ఆర్థిక పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు GO 58 విడుదల చేసింది. 2020 తరువాత సర్వీసులోకి తీసుకున్న వారందరికీ ఇది వర్తిస్తుంది. అర్హులకు ప్రాధాన్య క్రమంలో కలెక్టర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఉద్యోగాలిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వికలాంగ జాబితాలో లేని వారికి మానిటరీ బెనిఫిట్స్ అందిస్తామని చెప్పారు.

News December 26, 2025

COEకి శ్రేయస్.. న్యూజిలాండ్ సిరీస్‌కి రెడీనా?

image

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్(ODI) శ్రేయస్ అయ్యర్ ఇవాళ బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌(COE)కు వెళ్లారు. OCT 25న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. నాలుగు నుంచి ఆరురోజుల వరకు వైద్యులు అయ్యర్‌ హెల్త్‌ని అసెస్ చేసి అతని కంబ్యాక్‌ని డిసైడ్ చేస్తారు. ఇటీవల బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించిన అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్‌కు అందుబాటులోకి వస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.