News November 30, 2024

రైతు బంధు కంటే రూ.500 బోనస్ ఎలా మేలు అవుతుంది?: హరీశ్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని చూస్తోందని హరీశ్ రావు అన్నారు. ‘రైతుబంధు కంటే సన్నాలకిచ్చే ₹500 బోనసే మేలు అని రైతులు అంటున్నట్లు మంత్రి తుమ్మల చెబుతున్నారు. 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లకు దక్కిన బోనస్ ₹26cr. అదే రైతుబంధు కింద ఏడాదికి ₹7500cr రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రైతుబంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు ఎలా అవుతుంది?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Similar News

News November 23, 2025

29న కాకినాడ జిల్లాకు పవన్‌.. అభివృద్ధి పనులకు శ్రీకారం

image

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 29న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంతో పాటు కాకినాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌, రూట్‌ మ్యాప్‌పై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

News November 23, 2025

సామ్ కరన్ ఎంగేజ్‌మెంట్

image

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్‌లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.

News November 23, 2025

పిల్లలు బరువు తగ్గుతున్నారా?

image

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.