News March 19, 2025
ఐపీఎల్లో రాణిస్తే టెస్టుల్లో చోటు ఎలా?: అశ్విన్

ఆటగాళ్ల ప్రదర్శనను ఆయా ఫార్మాట్ల వారీగా పరిగణనలోకి తీసుకోవాలని అశ్విన్ అన్నారు. ‘T20ల్లో రాణిస్తే ODI/టెస్టులకు, టెస్టుల్లో రాణిస్తే T20లకు తీసుకోవాలని జనం అంటుంటారు. ఇది కరెక్ట్ కాదు. IPLలో రాణిస్తే T20Iకు మాత్రమే తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. శ్రేయస్ గురించి మాట్లాడుతూ ‘IPLలో కెప్టెన్గా రాణిస్తే టెస్టుల్లో చోటు ఎలా దక్కుతుంది? CTలో అతను బాగా ఆడాడు. IPLలోనూ రాణిస్తాడు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 1, 2026
ఎస్సీలకు శుభవార్త.. వడ్డీ మాఫీ, కొత్త లోన్లు

AP: ఎస్సీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం ఉపాధి పథకాల కింద SC యువత తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేసింది. దీంతో 11,479 మందికి ఊరట కలగనుంది. మరోవైపు SC కార్పొరేషన్, సెర్ప్ ఆధ్వర్యంలో 4,400 మందికి రాయితీ రుణాలు ఇవ్వనుంది. ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ₹50వేల వరకు రాయితీ ఇచ్చి, మిగతా మొత్తాన్ని వడ్డీలేని రుణంగా ఇవ్వనుంది. ఇందుకు ప్రభుత్వం ₹63.26 కోట్లు రిలీజ్ చేసింది.
News January 1, 2026
ఫుల్ కిక్కు.. 4 రోజుల్లో రూ.1,230కోట్ల మద్యం అమ్మకాలు

TG: కొత్త ఏడాదికి ముందు 4 రోజుల్లోనే(28,29,30,31) రూ.1,230 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ నెలలో మొత్తంగా రూ.5వేల కోట్ల మద్యం సేల్స్ జరిగాయని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడమూ కారణమని చెబుతున్నారు. ఒక్క నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం రికార్డు కాగా, 2023 డిసెంబర్లో రూ.4,291 కోట్ల అమ్మకాలు జరిగాయి.
News January 1, 2026
ఈ దశలో మామిడికి తప్పక నీరు అందించాలి

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రకాల మామిడి చెట్లలో ఇప్పటికే పూమొగ్గలు కనిపిస్తున్నాయి. ఇలా పూమొగ్గలు ఏర్పడి, అవి పెరుగుదల దశలో ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడి ఇవ్వాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిందె ఏర్పడిన తర్వాత (బఠాణి గింజ సైజులో ఉన్నప్పుడు), ప్రతి 15-20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలని చెబుతున్నారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి వ్యవసాయ నిపుణుల సూచనలు తీసుకోవాలి.


