News March 19, 2025

ఐపీఎల్‌లో రాణిస్తే టెస్టుల్లో చోటు ఎలా?: అశ్విన్

image

ఆటగాళ్ల ప్రదర్శనను ఆయా ఫార్మాట్ల వారీగా పరిగణనలోకి తీసుకోవాలని అశ్విన్ అన్నారు. ‘T20ల్లో రాణిస్తే ODI/టెస్టులకు, టెస్టుల్లో రాణిస్తే T20లకు తీసుకోవాలని జనం అంటుంటారు. ఇది కరెక్ట్ కాదు. IPLలో రాణిస్తే T20Iకు మాత్రమే తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. శ్రేయస్ గురించి మాట్లాడుతూ ‘IPLలో కెప్టెన్‌గా రాణిస్తే టెస్టుల్లో చోటు ఎలా దక్కుతుంది? CTలో అతను బాగా ఆడాడు. IPLలోనూ రాణిస్తాడు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై కమిటీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై ప్రభుత్వం ఏడుగురితో కమిటీని ఏర్పాటుచేసింది. ఈమేరకు GO880 విడుదల చేసింది. CS నేతృత్వంలో GAD, ఫైనాన్స్, హెల్త్ సెక్రటరీలు, AP గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ల ప్రెసిడెంట్లు సభ్యులుగా, NTR వైద్యసేవా ట్రస్టు CEO కన్వీనర్‌గా ఉన్నారు. కాగా 8 వారాల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఈ కమిటీకి కాలపరిమితిని నిర్దేశించింది.

News December 11, 2025

పంచాయతీ ఎన్నికలు.. అత్యధిక పోలింగ్ ఎక్కడంటే?

image

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియగా కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 87.93 శాతం పోలింగ్‌ నమోదైంది. తర్వాతి స్థానాల్లో సూర్యాపేట(87.77%), మెదక్‌(86%), నల్గొండ(81.63%), వరంగల్‌(81.2%), నిర్మల్‌(79.81%), మంచిర్యాల(77.34%), హన్మకొండ(75.6%), ములుగు(73.57%), జనగాం(71.96%), ఆదిలాబాద్‌(69.10%) జిల్లాలున్నాయి.

News December 11, 2025

భారతీయులను పంపించడం సిగ్గుచేటు: ట్రంప్

image

అమెరికాలో టాప్ యూనివర్సిటీల్లో చదువు పూర్తిచేసుకున్న టాలెంటెడ్ ఇండియన్స్ దేశం విడిచి వెళ్లాల్సి వస్తోందని, ఇది సిగ్గుచేటని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా ఆయన కొత్త “<<18530951>>ట్రంప్ గోల్డ్ కార్డ్<<>>”ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడిన ఆయన హైస్కిల్డ్‌ స్టూడెంట్స్‌కు ఉద్యోగం ఇచ్చి వారిని అమెరికాలోనే నిలుపుకోవడానికి ఇది కీలకమన్నారు. కంపెనీలు ఈ కార్డ్ కొనుగోలు చేయొచ్చని వివరించారు.