News September 20, 2024

ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారు?: షర్మిల

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం చిన్న విషయం కాదని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే ఎందుకు బయటపెట్టలేదని, విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీశారు. జగన్ హయాంలో ఎంపిక చేసిన కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.

Similar News

News December 20, 2025

భార్యను బాధపెడుతున్నారా! శ్రీనివాసుడికే తప్పలేదు..

image

భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలాన్ని తన్నినప్పుడు, ఆ అవమానం భరించలేక లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడింది. దీంతో శ్రీహరి అప్పులు చేయాల్సి వచ్చింది. ఇల్లాలి కంట కన్నీరు చిందితే ఆ ఇంటి ఐశ్వర్యం హరించుకుపోతుంది అనేందుకు ఈ వృత్తాంతమే నిదర్శనం. భార్య మనసు నొప్పించకుండా, గౌరవించే ఇంట్లోనే మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. స్త్రీ గౌరవమే కుటుంబ సౌభాగ్యానికి మూలం. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.

News December 20, 2025

రైతుల అకౌంట్లలో ‘బోనస్’ డబ్బులు జమ

image

TG: రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లు విడుదల చేసింది. శుక్రవారం నాటికి మొత్తం 11.45 లక్షల మంది రైతులు 59.74 లక్షల టన్నుల ధాన్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. వీటికిగానూ రూ.13,833 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. మీకు సన్న వడ్ల ‘బోనస్’ పడిందా?

News December 20, 2025

లింగ మిరియాల కలుపు మొక్కలను ఎలా నియంత్రించాలి?

image

‘లింగ మిర్యాల’ కలుపు మొక్కలు రబీలో ఉష్ణోగ్రతలు తగ్గాక, అపరాల కోత అనంతరం భూమిలో తేమను పీల్చుకొని పెరిగి పంటకు ఎక్కువ నష్టం కలిగిస్తాయి. ఇవి 2 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాపిర్ 200ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. అపరాల కోత తర్వాత లీటరు నీటికి 2,4D సోడియం సాల్ట్ 2 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. భూములను సకాలంలో దున్నడం, 2,3 ఏళ్లకు లోతు దుక్కులతో ఈ సమస్యను తగ్గించవచ్చు.