News September 20, 2024
ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారు?: షర్మిల

AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం చిన్న విషయం కాదని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే ఎందుకు బయటపెట్టలేదని, విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీశారు. జగన్ హయాంలో ఎంపిక చేసిన కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.
Similar News
News December 21, 2025
కుంభమేళా ‘మోనాలిసా’.. క్రేజ్ తగ్గేదేలే

కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన మోనాలిసా క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే సినిమాల్లో పలు అవకాశాలు దక్కించుకున్న ఆమె షాపింగ్ మాల్స్, హోటల్స్ ఓపెనింగ్స్, పబ్లిక్ ఈవెంట్లకూ గెస్ట్గా హాజరవుతున్నారు. తాజాగా HYDలో ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ‘లైఫ్’ అనే తెలుగు మూవీలోనూ ఇటీవల ఆమెకు నటించే ఛాన్స్ వచ్చింది. షూటింగ్ వీడియోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేస్తుంటారు.
News December 21, 2025
గ్యారంటీలను గాలికొదిలేశారా?.. సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ

TG: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ‘2 ఏళ్ల పాలనపై CM రేవంత్ను మీరు అభినందించారు. మరి 6 గ్యారంటీల అమలు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారా? లేక గ్యారంటీలను గాలికొదిలేశారా? 420 హామీలను మూసీలో కలిపేలేశారా? గాంధీభవన్లో పాతరేశారా? హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే మీ అభయహస్తమే ప్రజల ఆగ్రహంతో భస్మాసుర హస్తమవుతుంది’ అని హెచ్చరించారు.
News December 21, 2025
ధనుర్మాసం: ముగ్గులు వేస్తున్నారా?

ధనుర్మాసంలో ముగ్గులు వేయాలంటారు. తద్వారా శ్రీనివాసుడే ఇంటికి వస్తాడని నమ్ముతారు. అలాగే బియ్యప్పిండి ముగ్గు చీమలు, పక్షులకు ఆహారమవుతుంది. తద్వారా మనకు పుణ్యం వస్తుంది. ముగ్గుల మధ్యలో ఉంచే గొబ్బెమ్మలు మహాలక్ష్మి అనుగ్రహాన్నిస్తాయి. శాస్త్రీయంగా.. తెల్లవారుజామునే ముగ్గులు వేస్తే శరీరానికి ధనుర్వాయువు అనే స్వచ్ఛమైన గాలి తగిలి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చుక్కల ముగ్గుతో ఏకాగ్రత, మానసిక ఉల్లాసం పెరుగుతాయట.


