News October 12, 2024

‘రంజీ ట్రోఫీ’కి ఆ పేరు ఎలా వచ్చింది?

image

నవానగర్ (ప్ర‌స్తుత జామ్‌న‌గ‌ర్‌) గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ తీర ప్రాంతం. గ‌తంలో దీన్ని జ‌డేజా రాజ్‌పుత్ రాజ‌వంశీయులు పాలించేవారు. ఇక్కడి రాజును జామ్ సాహెబ్‌గా పిలుస్తారు. న‌వాన‌గ‌ర్‌ను 1907 నుంచి రంజిత్‌సిన్హ్ జీ విభా జీ పాలించారు. ఈయ‌న ప్రపంచ ప్ర‌సిద్ధ క్రికెట్ ఆట‌గాడు. ఇంగ్లండ్ తరఫున ఆడారు. ఈయ‌న పేరు మీదే దేశంలో ఏటా రంజీ ట్రోఫీ జ‌రుగుతుంది. ఈ రాజవంశం నుంచి ఎక్కువ మంది క్రికెటర్లుగా రాణించారు.

Similar News

News October 12, 2024

భారీ వర్ష సూచన.. అధికారులకు హోంమంత్రి ఆదేశాలు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్ఠ పర్చాలని అన్నారు.

News October 12, 2024

ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు: పొన్నం

image

TG: కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట(D) హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల అంచనా కోసమే సర్వే చేపడుతున్నాం. 60 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమం చేపడతాం. కులగణనకు ప్రజలంతా సహకరించాలి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు.

News October 12, 2024

ఆ విషయంలో భాగ‌స్వామి వద్దకు కాకపోతే ఇంకెవరి వద్దకు వెళ్తారు: హైకోర్టు

image

నైతిక నాగ‌రిక‌ స‌మాజ‌ంలో ఒక వ్య‌క్తి (M/F) శారీరక, లైంగిక కోరిక‌ల‌ను తీర్చుకోవ‌డానికి భాగ‌స్వామి వ‌ద్ద‌కు కాకుండా ఇంకెవ‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్తార‌ని అల‌హాబాద్ హైకోర్టు ప్రశ్నించింది. భ‌ర్త‌పై పెట్టిన‌ వ‌ర‌క‌ట్నం కేసులో భార్య ఆరోప‌ణ‌ల‌కు త‌గిన‌ ఆధారాలు లేవ‌ని పేర్కొంటూ కేసు కొట్టేసింది. ఈ కేసు ఇద్దరి మ‌ధ్య‌ లైంగిక సంబంధ అంశాల్లో అస‌మ్మ‌తి చుట్టూ కేంద్రీకృత‌మైనట్టు పేర్కొంది.