News September 24, 2024

బేడీలతో ఉన్న నిందితుడు తుపాకీ ఎలా కాల్చాడు?: ‘మహా’ విపక్షాలు

image

బ‌ద్లాపూర్ లైంగిక దాడి కేసులో నిందితుడి ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న‌పై మ‌హారాష్ట్ర విప‌క్షాలు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. BJP నేత‌కు చెందిన స్కూల్‌లో ఈ లైంగిక దాడి జ‌ర‌గ‌డంతో ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయంటున్నాయి. చేతుల‌కు బేడీల‌తో ఉన్న నిందితుడు తుపాకీ ఎలా కాల్చ‌గ‌లిగాడ‌ని EX హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్ర‌శ్నించారు. ఇది చ‌ట్టం, న్యాయ వ్య‌వస్థ విచ్ఛిన్న‌మే అని MP సుప్రియా సూలే విమ‌ర్శించారు.

Similar News

News November 18, 2025

X(ట్విటర్) డౌన్

image

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT

News November 18, 2025

చలికి చర్మం పగులుతుందా?

image

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.

News November 18, 2025

పాడి పశువులకు మేత, దాణా ఇలా అందిస్తే మంచిది(1/2)

image

పాడి పశువులకు వరిగడ్డి, చొప్పలాంటి ఎండు మేతతో పాటు తప్పనిసరిగా పచ్చిమేత ఉండాలి. పశువు శరీర బరువు, పాల మోతాదును అనుసరించి మేత అందిస్తే దాని పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాడి పశువు ప్రతి 45 కిలోల శరీర బరువుకు 1-1.5 కిలోల ఎండు మేత, 3-5 కిలోల పచ్చిమేత తింటుంది. నాలుగు లీటర్ల లోపు పాలిచ్చే పశువులకు సాధారణంగా 4-5 కిలోల ఎండుగడ్డి, 1-1.5 కిలోల దాణా మిశ్రమం సరిపోతుంది. ఎక్కువగా ఇచ్చి వృథా చేయకూడదు.