News March 3, 2025

కిడ్నీలో రాళ్లు ఎలా వస్తాయంటే?

image

ప్రస్తుతం కిడ్నీలో రాళ్ల సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. మూత్రంలోని కొన్ని కెమికల్స్ బయటకు వెళ్లకుండా లోపలే పేరుకుపోవడం వల్ల కొన్ని స్ఫటికాలు ఏర్పడి రాళ్లుగా మారతాయి. నాన్‌వెజ్ ఎక్కువగా తిన్నా, నీళ్లు తక్కువగా తాగినా కిడ్నీలో రాళ్లు వస్తాయి. నిద్రలేమి, ఆలస్యంగా భోజనం చేయడం, విటమిన్ బీ6, సీ, డీ లోపం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. షుగర్, ఒబేసిటీతో బాధపడుతున్నవారిలో ఈ సమస్య అధికం.

Similar News

News March 3, 2025

రష్మిక మందన్నకు బుద్ధి చెప్తాం: కాంగ్రెస్ నేతలు

image

నటి రష్మిక మందన్నకు బుద్ధి చెప్తామని KA కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆహ్వానించినప్పటికీ కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆమె రాకపోవడమే ఇందుకు కారణం. వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారని మండి MLA రవికుమార్ మండిపడ్డారు. తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని ప్రశ్నించారు. DyCM డీకే శివకుమార్ చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.

News March 3, 2025

అయోధ్యపై ISI కుట్ర: బాంబుదాడికి సిద్ధపడ్డ టెర్రరిస్టు

image

అయోధ్య రామమందిరాన్ని పేల్చేసేందుకు ISI భారీ కుట్ర పన్నినట్టు తెలిసింది. ఇందుకోసం ఫైజాబాద్ మటన్ వ్యాపారి, టెర్రరిస్టు అబ్దుల్ రెహ్మాన్‌ను నియమించుకుంది. రెక్కీ నిర్వహించాక ఫైజాబాద్ నుంచి హరియాణాలోని ఫరీదాబాద్‌కు చేరుకున్న రెహ్మాన్‌కు ఓ హ్యాండ్లర్ హ్యాండ్ గ్రెనేడ్లను ఇచ్చాడు. రైల్లో తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా గుజరాత్ ATF, ఫరీదాబాద్ STF టీమ్స్ అతడిని పట్టుకున్నాయి.

News March 3, 2025

దుబాయి మాకు హోం గ్రౌండ్ కాదు: రోహిత్ శర్మ

image

దుబాయ్ తమ హోం గ్రౌండ్‌ కాదని, ఈ పిచ్‌ తమకూ కొత్తేనని టీమ్‌ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మఅన్నారు. ఇక్కడ తామాడిన మూడు మ్యాచులలో ప్రతి గేమ్‌కు పిచ్ పరిస్థితులు మారాయన్నారు. ILT20 టోర్నమెంట్‌ చూసినప్పుడు గ్రౌండ్ కండీషన్ అర్థమైందని పిచ్‌లు స్లోగా ఉండటం వల్లే 5గురు స్పిన్నర్లను ఆడించామని తెలిపారు. దుబాయిలోనే అన్నిమ్యాచులు ఆడటం ఇండియాకు కలసివచ్చిందని పలు దేశాల క్రికెటర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!