News September 14, 2024
నిర్మాణాలు పూర్తవకుండా కాలేజీలు ఎలా ప్రారంభిస్తాం: సత్యకుమార్

AP: ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘మెడికల్ కాలేజీల నిర్మాణం గత ఐదేళ్లలో పూర్తి చేయలేదు. వసతులు లేకుండా తరగతులు ఎలా ప్రారంభిస్తాం? వైద్య విద్య అందించాలంటే NMC ప్రమాణాలు పాటించాలి. నిర్మాణంలో ఉన్న 12 కాలేజీల్లో వచ్చే ఏడాది క్లాసులు ప్రారంభిస్తాం. జగన్ ఆరోగ్యశ్రీకి రూ.2500 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. మేం రాగానే రూ.652 కోట్లు చెల్లించాం’ అని వివరించారు.
Similar News
News July 9, 2025
నేడు స్కూళ్లకు బంద్ ఉందా?

నేడు ‘భారత్ బంద్’ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. బంద్కు మద్దతుపై ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయ సంఘాలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అటు విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే ప్రైవేట్ స్కూళ్లు బంద్ పాటిస్తాయి. కానీ ఇవాళ కార్మిక సంఘాలు మాత్రమే బంద్లో పాల్గొంటున్నాయి. దీంతో ప్రైవేట్ స్కూళ్లు సైతం తెరిచే ఉండనున్నాయి. బంద్ ఉంటుందని తల్లిదండ్రులకు సైతం మెసేజ్ రాలేదు.
News July 9, 2025
రేపటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్

AP: MBA/MCA ప్రవేశాల కోసం నిర్వహించే ICET తొలి విడత కౌన్సెలింగ్ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈ నెల 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకోవచ్చని, 13 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. సీట్లు పొందిన విద్యార్థుల సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆదేశించారు.
News July 9, 2025
హజ్ యాత్రకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్ర 2026కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 31 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. ఇంటర్నేషనల్ పాస్ పోర్టును కలిగి ఉండటం తప్పనిసరని పేర్కొంది. యాత్రికులు hajcommittee.gov.in లేదా HAJ SUVIDHA మొబైల్ యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరణం, ఎమర్జెన్సీ మినహాయించి యాత్రను క్యాన్సిల్ చేసుకుంటే జరిమానా తప్పదని స్పష్టం చేసింది.