News September 14, 2024
నిర్మాణాలు పూర్తవకుండా కాలేజీలు ఎలా ప్రారంభిస్తాం: సత్యకుమార్

AP: ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘మెడికల్ కాలేజీల నిర్మాణం గత ఐదేళ్లలో పూర్తి చేయలేదు. వసతులు లేకుండా తరగతులు ఎలా ప్రారంభిస్తాం? వైద్య విద్య అందించాలంటే NMC ప్రమాణాలు పాటించాలి. నిర్మాణంలో ఉన్న 12 కాలేజీల్లో వచ్చే ఏడాది క్లాసులు ప్రారంభిస్తాం. జగన్ ఆరోగ్యశ్రీకి రూ.2500 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. మేం రాగానే రూ.652 కోట్లు చెల్లించాం’ అని వివరించారు.
Similar News
News December 19, 2025
ఎప్స్టీన్ ఫైల్స్: ‘ఇప్పుడే అమ్మాయిలను పంపుతా’

అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ <<18547375>>ఎస్టేట్<<>>లోని మరిన్ని ఫొటోలను US హౌస్ డెమొక్రాట్ల కమిటీ రిలీజ్ చేసింది. మొత్తం 68 ఫొటోల్లో బిల్ గేట్స్, నోవమ్ చోమ్స్కీ, వూడీ అలెన్ వంటి వాళ్లు ఉన్నారు. ‘ఇప్పుడే అమ్మాయిలను పంపుతా’ అంటూ ఉన్న మెసేజీలు, పేర్లు బ్లర్ చేసిన రష్యా, లిథువేనియా, ఉక్రెయిన్ దేశాల మహిళల పాస్పోర్టులూ ఉన్నాయి. కమిటీ వద్ద మొత్తం 95 వేల ఇమేజెస్ ఉన్నట్లు తెలుస్తోంది.
News December 19, 2025
AIIMS బిలాస్పుర్లో ఉద్యోగాలు

AIIMS బిలాస్పుర్ 68 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, BDS ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్/స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. జీతం నెలకు రూ.56,100+అలవెన్సులు చెల్లిస్తారు. డిసెంబర్ 23న రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.aiimsbilaspur.edu.in
News December 19, 2025
MLAల ఫిరాయింపు: నేడు సుప్రీంలో విచారణ

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కోర్టు గడువు నేపథ్యంలో ఐదుగురికి క్లీన్ చిట్ ఇస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం వెల్లడించారు. కడియం, దానం నాగేందర్ ఇంకా వివరణ ఇవ్వలేదు. తమ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరారని ఆరోపిస్తున్న తరుణంలో స్పీకర్ అనూహ్య నిర్ణయంతో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.


