News June 22, 2024
NTA ఎగ్జామ్ సెంటర్లను ఎలా ఎంచుకుంటుంది?

NEET, UGC NET పరీక్షల నిర్వహణలో అవకతవకలతో NTA వార్తల్లోకెక్కింది. వరుస పేపర్ లీకేజీలు జరగడంతో అసలు NTA ఎగ్జామ్ సెంటర్లను ఎలా ఎంచుకుంటుందనే సందేహం మొదలైంది. ఇందుకోసం గతంలో CBSE, NTAల తరఫున పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలలతో ఒక లిస్ట్ తయారు చేస్తుంది. మళ్లీ అందులో ఫైనల్ లిస్ట్ తీసి పాఠశాలల అనుమతి కోరుతుంది. మరోసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అనుమానాస్పద సెంటర్లను బ్లాక్ లిస్టులో పెడుతుంది.
Similar News
News September 16, 2025
శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం: భూమన

AP: శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం జరిగిందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి వాపోయారు. ‘అలిపిరిలో మలమూత్రాలు విసర్జించే చోట, మద్యం బాటిల్స్ మధ్య శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, హైందవ ధర్మానికి తూట్లు పొడిచేలా టీటీడీ తీరు ఉంది. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత వరుసగా ఘోర అపచారాలు జరుగుతున్నాయి. హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.
News September 16, 2025
పిల్లలకు పాలు ఎలా పట్టించాలి?

బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలి. అయితే జాగ్రత్తగా పాలు పట్టించకపోతే గొంతులోకి బదులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి బిడ్డకు ప్రాణాంతకమవుతుంది. పాలిచ్చేటప్పుడు శరీరం కంటే బిడ్డ తల పైకి ఉండాలి. చేతులతో బిడ్డ భుజాలు, తల, వీపు భాగానికి ఆసరా ఇవ్వాలి. పాలివ్వడానికి తల్లి ముందుకు ఒంగకూడదు. కుర్చీలో వెనక్కి ఆనుకొని పట్టించాలి. పాలు పట్టాక జీర్ణం అయ్యేందుకు కొద్దిసేపు బిడ్డ వీపు నెమ్మదిగా నిమరాలి.
News September 16, 2025
తెలంగాణ అప్డేట్స్

* ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో నూతన పాస్పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
* ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు రానున్న కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్. రేపు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి హాజరు.
* నల్గొండలో పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధించిన పొక్సో కోర్టు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పు.