News April 12, 2025
దీపం-2 డ్యాష్బోర్డు ఎలా పనిచేస్తుంది?

✒ https://epds2.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దీపం-2 డ్యాష్ బోర్డు కనిపిస్తుంది.
✒ KNOW YOUR DEEPAM2 STATUSపై క్లిక్ చేసి రేషన్ కార్డు లేదా ఎల్పీజీ నంబర్ ఎంటర్ చేయాలి.
✒ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే దీపం-2 ఎలిజిబిలిటీ స్టేటస్, సబ్సిడీ జమ వివరాలు కనిపిస్తాయి.
✒ ఏదైనా సమస్య ఉంటే దానికి గల కారణాలు తెలుస్తాయి.
✒ NOTE: ఈ డ్యాష్బోర్డు అందుబాటులోకి వచ్చాక ఆప్షన్లు కనిపిస్తాయి.
Similar News
News February 12, 2026
నమీబియాతో మ్యాచ్.. ప్రయోగాలు చేస్తారా?

USAపై గెలిచిన టీమ్ ఇండియా ఇవాళ T20 WCలో రెండో మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 7pmకు మొదలయ్యే మ్యాచులో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కోచ్ గంభీర్ సానూకూలంగా ఉండటంతో శాంసన్ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. బుమ్రాకు రెస్ట్ కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు అభిషేక్ ఫిట్నెస్పై ఇంకా క్లారిటీ లేకపోగా టీమ్11లో ఉంటాడా అనేది అనుమానమే.
News February 12, 2026
బ్రిటీష్ అధికారికి స్వామివారి దర్శనం

బ్రిటీష్ కాలంలో సర్ థామస్ మన్రో అనే అధికారి మంత్రాలయ మఠం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భావించారు. అయితే, ఆశ్చర్యకరంగా రాఘవేంద్ర స్వామి బృందావనం నుంచి బయటకు వచ్చి మన్రోకు దర్శనమిచ్చారు. ఆయనతో చర్చించి భూములను స్వాధీనం చేసుకోకుండా ఒప్పించారు. ఈ సంభాషణ గురించి మన్రో స్వయంగా ‘మద్రాస్ గెజిట్’లో నమోదు చేయడం విశేషం. ఓ పరాయి దేశస్థుడికి కూడా దర్శనమిచ్చిన స్వామివారి కరుణా సాగరం అనంతమైనది.
News February 12, 2026
1,495 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

TG: ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ నిన్నటితో ముగిశాయి. విధుల్లో అలసత్వం వహించిన 53 ఎగ్జామినర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలకు 3,11,011 జనరల్ కోర్సుల విద్యార్థులు, 90,254 మంది వొకేషనల్ విద్యార్థులు హాజరైనట్లు వివరించారు.


