News April 12, 2025
దీపం-2 డ్యాష్బోర్డు ఎలా పనిచేస్తుంది?

✒ https://epds2.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దీపం-2 డ్యాష్ బోర్డు కనిపిస్తుంది.
✒ KNOW YOUR DEEPAM2 STATUSపై క్లిక్ చేసి రేషన్ కార్డు లేదా ఎల్పీజీ నంబర్ ఎంటర్ చేయాలి.
✒ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే దీపం-2 ఎలిజిబిలిటీ స్టేటస్, సబ్సిడీ జమ వివరాలు కనిపిస్తాయి.
✒ ఏదైనా సమస్య ఉంటే దానికి గల కారణాలు తెలుస్తాయి.
✒ NOTE: ఈ డ్యాష్బోర్డు అందుబాటులోకి వచ్చాక ఆప్షన్లు కనిపిస్తాయి.
Similar News
News January 12, 2026
నెలలో పెళ్లి.. అమెరికా అదుపులో నేవీ అధికారి!

అమెరికా స్వాధీనం చేసుకున్న <<18803079>>రష్యా నౌకలో<<>> ముగ్గురు భారతీయులు ఉండటం తెలిసిందే. అందులో హిమాచల్ ప్రదేశ్కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ రిక్షిత్ చౌహాన్(26) కూడా ఉన్నారు. ఫిబ్రవరి 19న ఆయన పెళ్లి జరగాల్సి ఉంది. రష్యా సంస్థ ఆయన్ను తొలిసారి సముద్ర విధులకు పంపింది. ఈ క్రమంలో ఈనెల 7న చౌహాన్తో మాట్లాడామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కొడుకును సురక్షితంగా తీసుకురావాలని తల్లి రీతాదేవి వేడుకుంటున్నారు.
News January 12, 2026
18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు: CM

TG: తాను రెండేళ్ల పాలనలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సెలవు తీసుకోవాలని ముందురోజు అనుకుంటా. కానీ ఏదో ఒక పని ఉంటుంది. సీఎం పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ఇప్పుడు బాధ్యతలు మరింత పెరిగాయి. రోజుకు 18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు. ఇది బరువుగా చూడట్లేదు. బాధ్యతగా చూస్తున్నా’ అని ఉద్యోగులతో సమావేశంలో పేర్కొన్నారు.
News January 12, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు CM సంక్రాంతి కానుక

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. అటు ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.


