News November 2, 2024
తిరుమలను వక్ఫ్ బోర్డుతో ఎలా పోలుస్తారు?: విష్ణువర్ధన్ రెడ్డి

MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన <<14510629>>వ్యాఖ్యలపై<<>> AP BJP నేత విష్ణువర్ధన్రెడ్డి స్పందించారు. ‘మీరు హిందువుల అత్యంత పవిత్రమైన స్థలాన్ని కొన్ని కమ్యూనిటీ సెంటర్ల(వక్ఫ్ బోర్డు)తో పోల్చుతున్నారు. ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో హిందువులు అడుగు పెట్టలేరు. మరి మీరు తిరుమలలో ప్రవేశించాలనుకుంటున్నారా? మీరు నిజంగా బాలాజీని విశ్వసిస్తున్నారా?’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 24, 2025
రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది. మార్కెట్లో రూ.40 నుంచి రూ.80 వరకు ఉన్న ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తొలుత జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో ఈ పథకం అమలుకానుంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా సరఫరా చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
News December 24, 2025
పాడి పశువులను అలా కట్టేసే ఉంచుతున్నారా?

చాలా మంది పాడి రైతులు పశువులను రోజంతా అలా కట్టేసి ఉంచుతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు వెటర్నరీ నిపుణులు. దీని వల్ల వాటికి గాయాలు కావడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవడంతో పాటు క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుందని అంటున్నారు. వాటిని కచ్చితంగా ఉదయం, సాయంత్రం కాసేపు నడిపించాలని సలహా ఇస్తున్నారు. వాటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పశువులకు రోజూ స్నానం చేయించాలని సూచిస్తున్నారు.
News December 24, 2025
CBSEలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (<


