News August 2, 2024
బీమా విధానంలో ఆరోగ్యశ్రీ ఎలా ఉంటుందంటే?(2/2)

AP: ప్రభుత్వం ఖరారు చేసిన లబ్ధిదారుల జాబితాకు అనుగుణంగా బీమా సంస్థలు హెల్త్ కార్డులు జారీ చేస్తాయి. రోగులు ఆ కార్డులతో వస్తే ఆస్పత్రులు నేరుగా బీమా కంపెనీకి సమాచారమిస్తాయి. అక్కడి నుంచి అనుమతి రాగానే చికిత్స ప్రారంభిస్తాయి. ఆస్పత్రులు పంపిన బిల్లులను పరిశీలించి బీమా కంపెనీలు చెల్లిస్తాయి. వాటికి ప్రభుత్వం సొమ్ము తిరిగి చెల్లిస్తుంది. ఈ ప్రక్రియపై జాతీయ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది.
Similar News
News March 17, 2026
దీదీని ఓడించేందుకు BJP మాస్టర్ ప్లాన్!

<<19408277>>మమతా బెనర్జీ<<>>ని ఆమె కోటలోనే కట్టడి చేసేందుకు BJP మాస్టర్ ప్లాన్ వేసింది. బలమైన నేత సువేందును పోటీకి దింపి దీదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయకుండా అడ్డుకట్ట వేయనుంది. 2021లో నందిగ్రామ్లో మమతను ఓడించిన ఆయన ఇప్పుడు భవానీపూర్లోనూ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గుజరాతీ, మార్వాడీ వంటి నాన్-బెంగాలీ ఓటర్లు 40% ఉండటంతో ఇక్కడ పోటీ టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీదీని డిఫెన్స్లో పడేయాలన్నది BJP అసలు స్కెచ్.
News March 17, 2026
హోటల్స్ మూత… అన్న క్యాంటీన్లకు తాకిడి

AP: నిన్న మొన్నటి వరకు కొద్దోగొప్పో తెరిచి ఉన్న హోటళ్లు వాణిజ్య LPG కొరతతో మూతపడుతున్నాయి. ఆ ప్రభావం అన్న క్యాంటీన్లపై పడుతోంది. ఇదివరకు ఒక్కో క్యాంటీన్ ద్వారా మధ్యాహ్నం 500మందికి మీల్స్ అందించేవారు. హోటల్స్ మూతతో అదనంగా 150 మీల్స్ సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో 3PM వరకు మీల్స్ అందించగా ఇప్పుడు ఉద్యోగులు, విద్యార్థులూ వస్తుండడంతో 2PMకల్లా భోజనాలు అయిపోతున్నట్లు చెబుతున్నారు.
News March 17, 2026
ఇరాన్ ప్రజలకు ఇదే మంచి అవకాశం: నెతన్యాహు

తమ దాడిలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. అలాగే ‘బసిజ్’ పారామిలిటరీ చీఫ్ గోలమ్రెజా సులేమానీ సైతం ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇరాన్లో తమ దాడులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని ఇరాన్ ప్రజలకు కల్పించాలనే ఆశతోనే ఈ అటాక్స్ చేస్తున్నామని పేర్కొన్నారు. అన్నీ ఒకేరోజులో జరగవని.. స్థిరంగా పోరాడితే అన్నీ సాధ్యమేనన్నారు.


