News March 21, 2024

58 ఏళ్ల వయసులో IVFకు అనుమతి ఎలా?

image

దివంగత సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు రెండో బిడ్డకు జన్మనివ్వడం వివాదాస్పదంగా మారుతోంది. సిద్ధూ తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ పద్ధతిలో రెండో బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆమెకు 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించింది. ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డను కనడానికి 21 నుంచి 50 ఏళ్ల వారికే అనుమతి ఉందని తెలిపింది. దీనిపై నివేదిక సమర్పించాలని లేఖ రాసింది.

Similar News

News July 9, 2025

జూన్‌లో SIPs ఇన్వెస్ట్‌మెంట్స్ రికార్డు

image

జూన్ నెలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌(SIPs)లో పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మేలో రూ.26,688 కోట్ల ఇన్‌ఫ్లో ఉండగా జూన్‌లో రూ.27,269 కోట్లు వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ తెలిపింది. మొత్తం SIP అకౌంట్లు 90.6 మిలియన్ల నుంచి 91.9 మిలియన్లకు పెరిగాయని వెల్లడించింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అసెట్స్ జూన్‌లో రూ.74 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది.

News July 9, 2025

క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే..

image

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. * రూ.672 కోట్ల ధాన్యం బకాయిల విడుదలకు అంగీకారం * హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు ఆమోదం * అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటుకు నిర్ణయం * కుళాయి నీరు అందించేందుకు రూ.10వేల కోట్ల రుణాల సమీకరణకు అనుమతి * నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, సరిహద్దుల విస్తరణకు ఆమోదం

News July 9, 2025

HCA, SRH మధ్య వివాదం ఏంటంటే?

image

IPL-2025 సందర్భంగా HCA, SRH మధ్య టికెట్ల వివాదం తలెత్తింది. రెగ్యులర్‌గా HCAకు 10% టికెట్లు ఫ్రీగా ఇస్తుండగా తనకు వ్యక్తిగతంగా మరో 10% టికెట్లు కావాలని HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ డిమాండ్ చేసినట్లు SRH ఆరోపించింది. అందుకు ఒప్పుకోకపోవడంతో LSGతో మ్యాచ్ సందర్భంగా VIP గ్యాలరీలకు తాళం వేసి జగన్మోహన్ వేధించారని ఫిర్యాదు చేసింది. విజిలెన్స్ విచారణలో ఇది నిజమని తేలడంతో జగన్మోహన్‌ను CID <<17008940>>అరెస్ట్<<>> చేసింది.