News May 4, 2024
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామి వారిని 62,624 మంది భక్తులు దర్శించుకోగా.. 32,638 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు సమకూరింది.
Similar News
News March 10, 2026
గ్యాస్తో పని లేకుండా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి

గల్ఫ్ యుద్ధంతో సిలిండర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ ఆదా చేసుకోవడం బెటర్. వీలైనంత వరకు స్టవ్తో పనిలేని ఫుడ్ సిద్ధం చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో దోశ, పూరి, వడ లాంటివి పక్కన పెట్టి సలాడ్స్, శాండ్విచ్, స్ప్రౌట్స్, మిక్స్డ్ ఫ్రూట్స్, బ్రెడ్-జామ్, బాయిల్డ్ ఎగ్స్(ఎగ్ బాయిలర్లో ఉడికించినవి), జ్యూస్లు తీసుకోవాలి. ఇవి మీ సిలిండర్ను ఆదా చేయడమే కాకుండా ఆరోగ్యానికీ మంచివి.
Share it
News March 10, 2026
రేపు జగన్ ప్రెస్మీట్

AP: వైసీపీ చీఫ్ జగన్ రేపు మీడియాతో మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. వివిధ అంశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేసే అవకాశం ఉంది.
News March 10, 2026
12pm-4pm పనులు రీషెడ్యూల్ చేసుకోండి: అనిత

AP: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. 12pm-4pm మధ్య బహిరంగ ప్రదేశాల్లో పనులుంటే రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. APSDMA, RTGS నుంచి ఎప్పటికప్పుడు వడగాల్పుల హెచ్చరికలు చేరవేయాలని ఆ విభాగాల అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు. వడదెబ్బ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.


