News April 6, 2024

శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 59,621 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు సమకూరింది.

Similar News

News November 17, 2025

సౌదీ ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు మృతి!.. CM దిగ్భ్రాంతి

image

సౌదీ <<18308554>>బస్సు<<>> ప్రమాదంలో 10 మంది హైదరాబాద్‌ వాసులు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 7997959754, 9912919545 నంబర్లకు కాల్ చేయాలని CS సూచించారు. అటు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు.

News November 17, 2025

‘ఆపరేషన్ సిందూర్’లో కాలు కోల్పోయిన ఆవుకు కొత్త జీవితం

image

‘ఆపరేషన్ సిందూర్’లో కాలు కోల్పోయిన ఆవుకు పశువైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన షెల్లింగ్‌లో గౌరి అనే ఆవు కాలు కోల్పోయింది. దీంతో దానికి దేశీయంగా తయారు చేసిన ‘కృష్ణ లింబ్’ అనే కృత్రిమ కాలుని అమర్చారు. దీంతో అది మునుపటిలా నడుస్తోంది. డాక్టర్ తపేశ్ మాథుర్ దీన్ని రూపొందించారు. అవసరమైన జంతువుల యజమానులకు వాటిని ఉచితంగా అందిస్తున్నారు.

News November 17, 2025

మోక్ష మార్గాన్ని చూపే విష్ణు శ్లోకం

image

ఏష మే సర్వధర్మాణాం ధర్మో ధిక తమోమతః|
యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్తవైరర్చేన్నరస్సదా||
‘పద్మముల వంటి కన్నులు గల విష్ణువును ఎవరైతే భక్తితో, స్తోత్రములతో ఆరాధిస్తారో.. అదే అన్ని ధర్మముల కంటే గొప్పదైనది’ అని ఈ శ్లోకం చెబుతోంది. ఇతర కర్మలు, వ్రతాలు, ఆచారాల కంటే దేవుడి పట్ల నిష్కల్మషమైన ఆరాధన, కీర్తన అత్యంత ముఖ్యమైనది, ఉత్తమమైనది. శుద్ధమైన భక్తి భావమే మనకు మోక్ష మార్గాన్ని చూపుతుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>