News July 3, 2024
రైతు భరోసా ఎన్ని ఎకరాలకివ్వాలి?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1718582571961-normal-WIFI.webp)
TG: రైతు భరోసా(రైతుబంధు) ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించిన అధికారులు.. మరింత మంది సలహాలు స్వీకరించనున్నారు. ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకోనున్నారు. 5 ఎకరాలు, 8, 10, 15, 20, 30 ఎకరాల్లోపు ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.
Similar News
News July 5, 2024
UK ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720162414156-normal-WIFI.webp)
వక్త, రచయిత ఉదయ్ నాగరాజు UK ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున నార్త్ బెడ్ఫోర్డ్షైర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. TGలోని సిద్దిపేట(D) శనిగరానికి చెందిన నాగరాజు భారత మాజీ PM పీవీ నరసింహారావుకు బంధువు. నిజామాబాద్(D) కోటగిరికి చెందిన కన్నెగంటి చంద్ర కన్జర్వేటివ్ అభ్యర్థిగా స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్లో ఓడిపోయారు. జనరల్ ప్రాక్టిషనర్గా సేవలందించిన ఆయన రెండుసార్లు కౌన్సిలర్గా, ఒకసారి మేయర్గా పనిచేశారు.
News July 5, 2024
ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ తప్పుడు ప్రచారం: TDP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720158429062-normal-WIFI.webp)
ప్రధాని మోదీ, AP CM చంద్రబాబు భేటీపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ మండిపడింది. ‘‘ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, సైకోలకి కోట్లు కుమ్మరిస్తూ ‘తాడేపల్లి ప్యాలెస్ సైకో’ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. PM, CM భేటీపై కూడా ఫేక్ న్యూస్ ఆర్టికల్స్ సృష్టించారు. నిన్న కూడా అసలు రాష్ట్రంతో చర్చలే జరపని capgemeni వెళ్లిపోయిందంటూ విష ప్రచారం. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని ట్వీట్ చేసింది.
News July 5, 2024
మీ ప్రేమకు చాలా థ్యాంక్స్: సూర్య కుమార్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720163553341-normal-WIFI.webp)
ముంబై మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు సాగిన ‘విక్టరీ పరేడ్’ గురించి స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘నిన్నటి సాయంత్రాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మా చుట్టూ ఉన్నవారిలో సంతోషం, భావోద్వేగాలు, వేడుకలు చూస్తే అంతా కలగా అనిపించింది. మీరు చూపిన ప్రేమకు చాలా థ్యాంక్స్. ఇది చూస్తే అర్థమవుతోంది మీకు ఈ కప్ అంటే ఎంత ఇష్టమో. ఈ కప్ మీ అందరికీ చెందినది’ అని ట్వీట్ చేశారు.