News July 3, 2024
రైతు భరోసా ఎన్ని ఎకరాలకివ్వాలి?

TG: రైతు భరోసా(రైతుబంధు) ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించిన అధికారులు.. మరింత మంది సలహాలు స్వీకరించనున్నారు. ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకోనున్నారు. 5 ఎకరాలు, 8, 10, 15, 20, 30 ఎకరాల్లోపు ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.
Similar News
News March 12, 2026
పారిశ్రామిక హబ్గా ఏపీ: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఉన్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి చూశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ‘అభివృద్ధి కోసం ఏ చిన్న ప్రయత్నం చేసినా దీర్ఘకాలంలో వాటి ఫలితాలను చూస్తాం’ అని పేర్కొన్నారు.
News March 12, 2026
ఫరూఖ్ను 20 ఏళ్లుగా చంపాలనుకుంటున్నా: నిందితుడు

J&K మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాపై <<19359185>>హత్యాయత్నం<<>> చేసిన కమల్ సింగ్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. ‘ఫరూఖ్ను చంపాలని 20 ఏళ్లుగా అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ అజెండా. ఇవాళ నాకు అవకాశం వచ్చింది. కాల్పులు జరిపింది నా తుపాకీతోనే. అదృష్టంకొద్దీ బతికిపోయారు’ అని పేర్కొన్నాడు. మాజీ సీఎంను చంపే ప్రయత్నం ఎందుకు చేశాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 12, 2026
కోడిగుడ్డు ధరలు తగ్గాయ్..

తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ఎగుమతులు భారీగా తగ్గిపోయి నిల్వలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్లో కొన్ని వారాల క్రితం ఒక్కో గుడ్డు రూ.7-8 ఉండగా ఇప్పుడు హోల్ సేల్ మార్కెట్లో రూ.3.5-4కే అమ్ముతున్నారు. రిటైల్లో మాత్రం రూ.6 వరకు తీసుకుంటున్నారు. మరి మీ దగ్గర గుడ్డు రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.


