News November 21, 2024

టెట్‌కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల గడువు నిన్నటితో ముగియగా, మొత్తం 2.48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పేపర్-1కి 71,000, పేపర్-2కి 1.55 లక్షలు, రెండు పేపర్లకు కలిపి 20,000 మంది అప్లై చేసుకున్నారని పేర్కొన్నారు. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే రేపటిలోపు (నవంబర్ 22) ఎడిట్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 21, 2025

ఇకపై ‘మనమిత్ర’లోనే ఆర్జిత సేవా టికెట్లు

image

AP: విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇకపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలోని అన్ని ఆర్జిత సేవల టికెట్లు మనమిత్ర వాట్సాప్ నంబర్ ద్వారానే లభ్యమవుతాయని అధికారులు తెలిపారు. కౌంటర్ల వద్ద టికెట్ల విక్రయం పూర్తిగా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

News December 21, 2025

ప్రకృతి సేద్యంలో ఈ ద్రావణాలు కీలకం.. తయారీ ఎలా?

image

ప్రకృతి సేద్యం పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే నేడు చాలా మంది రైతులు ప్రకృతి సాగువైపు అడుగులేస్తున్నారు. ఈ విధానంలో తొలుత లాభాలు ఆలస్యమైనా, కొంత కాలానికి రసాయన సాగు చేస్తున్న రైతులతో సమానంగా ఆదాయం వస్తుంది. ప్రకృతి సేద్యంలో అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం కీలక పాత్ర పోషిస్తాయి. వీటి తయారీ విధానం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 21, 2025

దేశంలో అదనంగా 75వేల మెడికల్ సీట్స్: నడ్డా

image

దేశంలో పేద, అణగారిన వర్గాలకు మంచి వైద్యం అందుతోందని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ‘ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు ఆలస్యం చేయకుండా పేదలకు కూడా వైద్యం చేసేలా చేస్తున్నాయి. 70ఏళ్లు దాటితే ఆదాయం, కులం, మతంతో సంబంధంలేకుండా మెడికల్ ఇన్యూరెన్స్ పరిధిలోకి వస్తారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 2029నాటికి దేశంలో మెడికల్ సీట్స్ సంఖ్య 75వేలు వరకు పెరుగుతాయి. గతేడాదే 23వేల సీట్లు పెంచాం’ అని తెలిపారు.