News November 14, 2024

డయేరియా మరణాలు ఎన్ని?: మండలిలో వాడీవేడి చర్చ

image

AP: డయేరియా మరణాలపై మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. విజయనగరం(D) గుర్ల, వివిధ ప్రాంతాల్లో ఎంతమంది చనిపోయారో చెప్పాలని YCP MLCలు ప్రశ్నించారు. గుర్లలో ఒక్కరే మరణించారని మంత్రి సత్యకుమార్ చెప్పారు. Dy.cm పవన్ గుర్లలో 10 మంది చనిపోయారని ₹2 లక్షల పరిహారం ప్రకటించారని, జగన్ కూడా అదేమేర సాయం చేశారని సభ్యులు గుర్తుచేశారు. మంత్రి నేరుగా ఆన్సరివ్వకుండా YCP పాలన వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

Similar News

News December 2, 2025

నేడు ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం రాక

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

News December 2, 2025

టుడే టాప్ స్టోరీస్

image

* హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CM CBN
* CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత
*ప్రాజెక్టులకు తక్కువ వడ్డీలకే రుణాలివ్వాలి: CM రేవంత్
* TG: ‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్ యాప్’
* GHMCలో 27మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోదం
* పదేళ్లలో రూ.34 లక్షల కోట్లు పెరిగిన విదేశీ అప్పు
*ఎయిపోర్టుల్లో GPS స్పూఫింగ్ జరిగింది: కేంద్రం
* పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్‌ నిడిమోరు