News November 14, 2024
డయేరియా మరణాలు ఎన్ని?: మండలిలో వాడీవేడి చర్చ

AP: డయేరియా మరణాలపై మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. విజయనగరం(D) గుర్ల, వివిధ ప్రాంతాల్లో ఎంతమంది చనిపోయారో చెప్పాలని YCP MLCలు ప్రశ్నించారు. గుర్లలో ఒక్కరే మరణించారని మంత్రి సత్యకుమార్ చెప్పారు. Dy.cm పవన్ గుర్లలో 10 మంది చనిపోయారని ₹2 లక్షల పరిహారం ప్రకటించారని, జగన్ కూడా అదేమేర సాయం చేశారని సభ్యులు గుర్తుచేశారు. మంత్రి నేరుగా ఆన్సరివ్వకుండా YCP పాలన వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
Similar News
News November 11, 2025
కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డికి CBI నోటీసులు

AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డికి CBI నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈనెల 13, లేదా 15న విచారణకు వస్తానని సుబ్బారెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కల్తీకి సంబంధించి సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నిస్తున్నారు.
News November 11, 2025
మరో భారీ ఎన్కౌంటర్

తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్లో భద్రతా బలగాలు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కీలక మావోయిస్టును బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.
News November 11, 2025
షమీ విషయంలో ఆరోపణలను ఖండించిన BCCI!

షమీని కావాలనే సెలక్ట్ చేయట్లేదన్న ఆరోపణలను ఓ BCCI అఫీషియల్ ఖండించినట్లు PTI పేర్కొంది. ‘షమీ ఫిట్నెస్పై తరచూ వాకబు చేస్తూనే ఉన్నాం. అతణ్ని ఇంగ్లండ్ సిరీస్కు పంపేందుకు ప్రయత్నించాం. ఇంగ్లండ్ లయన్స్పై భారత్-A తరఫున అతడిని బరిలోకి దింపితే ఫిట్నెస్పై అంచనా వస్తుందనుకున్నాం. కానీ సిద్ధమయ్యేందుకు షమీ తగిన సమయం కావాలన్నారు. అతణ్ని సంప్రదించలేదన్నది అవాస్తవం’ అని ఆయన చెప్పినట్లు వెల్లడించింది.


