News February 6, 2025

2009 నుంచి అక్రమ వలసదారులు ఎందరు వచ్చారంటే: జైశంకర్

image

అమెరికాతో ఎవరికీ లేని విధంగా మనకు పౌరులను వెనక్కి తీసుకొచ్చే ఒప్పందం ఉందని EAM జైశంకర్ అన్నారు. అక్కడ అక్రమంగా ఉంటున్నవారిని ఇక్కడికి పంపించడం ఇదే తొలిసారి కాదన్నారు. 2009 నుంచి 2025 వరకు వరుసగా 734, 799, 597, 530, 550, 591, 708, 1303, 1024, 1180, 2042, 1889, 805, 862, 670, 1368, 104 మందిని పంపినట్టు వెల్లడించారు. మిగిలిన వారిని సురక్షితంగా తీసుకొస్తామని రాజ్యసభలో వివరించారు.

Similar News

News December 15, 2025

గోదాదేవి రచించిన పాశురాల గురించి తెలుసా?

image

దైవారాధనకు కఠిన దీక్షలు అవసరం లేదని, స్వచ్ఛమైన ప్రేమతో కూడా దేవుడిని వశం చేసుకోవచ్చని గోదాదేవి నిరూపించింది. ఆమె అత్యంత సులభమైన వ్రతాన్ని ఆచరించి కృష్ణుడిని భర్తగా పొందింది. తాను ధరించిన పూల మాలను కృష్ణుడికి సమర్పించింది. ఆమె రచించిన 30 పాశురాలనే ‘తిరుప్పావై’ అంటారు. పెళ్లికాని యువతులు రోజుకొకటి చొప్పున 30 పాశురాలు ఆలపిస్తే సద్గుణాల భర్త వస్తాడట. రేపటి నుంచి భక్తి కేటగిరీలో పాశురాలను చూడొచ్చు.

News December 15, 2025

కోళ్లకు వ్యాధుల ముప్పు తగ్గాలంటే?

image

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.

News December 15, 2025

త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన: మహేశ్ గౌడ్

image

TG: త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. మంత్రుల మార్పు, చేర్పుపై తనకు స్పష్టత లేదని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్, అధిష్ఠానం మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు నల్లేరుపై నడక అని చెప్పారు.