News August 26, 2025
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ సీట్లు ఎన్నంటే?

TG: రాష్ట్రంలోని 315 ఎంబీఏ కాలేజీల్లో 25,991 సీట్లు, 90 ఎంసీఏ కాలేజీల్లో 6,404 సీట్లు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. MBA, ఎంసీఏల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ నెల 28 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. నిన్నటి వరకు 22,563 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 14,301 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారని వెల్లడించారు.
Similar News
News August 26, 2025
టారిఫ్స్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మొదలైన మార్కెట్స్

భారత స్టాక్ మార్కెట్స్ ఇవాళ భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అర్ధరాత్రి నుంచి 50% టారిఫ్స్ అమల్లోకి రానుండటం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ 574 పాయింట్ల నష్టంతో 81,061, నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,793 వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఆటో, HUL, హీరో మోటోకార్ప్, TCS లాభాల్లో ఉండగా టాటా స్టీల్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రిక్, ICICI బ్యాంక్, Airtel నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News August 26, 2025
BCCI స్పాన్సర్గా TOYOTA?

టీమ్ఇండియా స్పాన్సర్గా డ్రీమ్ 11ను BCCI తప్పించిన విషయం తెలిసిందే. దీంతో బోర్డు కొత్త స్పాన్సర్ కోసం ఎదురుచూస్తోంది. ఇందుకు జపాన్ ఆటోమేకర్ టయోటా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ కూడా స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు BCCI అధికారిక బిడ్డింగ్ మొదలుపెట్టలేదు. అటు SEP 9న మొదలయ్యే ఆసియా కప్లోపు స్పాన్సర్ దొరకడం దాదాపు కష్టమే.
News August 26, 2025
సెలవులు ఇవ్వాల్సిందే: మహిళా కమిషన్

TG: వినాయక చవితి, ఇతర పండుగలు, ఆదివారాల్లో జూనియర్ కాలేజీల విద్యార్థులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఇంటర్ బోర్డుకు సూచించింది. రేపు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు సెలవు ప్రకటించినా కొన్ని కాలేజీలు పాటించట్లేదంటూ మహిళా కమిషన్కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని కమిషన్ ఛైర్ పర్సన్ నేరేళ్ల శారద ఇంటర్ బోర్డుకు సూచనలు చేశారు. రేపు మీకు సెలవు ఉందా?