News February 5, 2025
రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలు ఎన్నంటే?

TG: రాష్ట్రంలో మొత్తం 5,810 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు ఈసీ లెక్కల్లో తేలింది. గతంలో 5,857 స్థానాలు ఉండగా ఈ సారి వాటి సంఖ్య తగ్గింది. జీహెచ్ఎంసీ, ఇతర నగరపాలక, పురపాలక సంస్థల్లో కొన్ని గ్రామాలు విలీనమవ్వడమే దీనికి కారణం. మండలానికి కనీసం ఐదు స్థానాలు ఉండేలా అధికారులు జాబితా రూపొందించారు. మరోవైపు రాష్ట్రంలో 32 జడ్పీ, 570 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.
Similar News
News December 11, 2025
550 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కపుర్తాలాలోని <
News December 11, 2025
రేగు పండ్లు తింటే ఎన్ని లాభాలో..

చలికాలంలో లభించే రేగు పండ్లను తరచూ తినడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణ, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మెరుగుపడతాయని వెల్లడిస్తున్నారు. కడుపులో మంట, మలబద్దకం సమస్యలు, చర్మంపై ముడతలు, మొటిమలు తగ్గుతాయంటున్నారు. కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ పండ్లు క్యాన్సర్ కారకాలనూ నిరోధిస్తాయంటున్నారు. మీకు రేగు పండ్లు ఇష్టమా? కామెంట్ చేయండి.
News December 11, 2025
14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. 13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు.
వెబ్సైట్: https://examinationservices.nic.in/


