News August 9, 2025

రాష్ట్రంలో రోజూ ఎంతమంది మద్యం తాగుతున్నారంటే?

image

AP: రాష్ట్ర జనాభాలో 31.2 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు జాతీయ కుటుంబ వైద్య సర్వే నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 0.2 శాతం మహిళలకు మద్యం అలవాటు ఉందని వెల్లడించింది. రోజూ 50 లక్షల మంది మందు తాగుతున్నారు. కోటిమందికిపైగా వారానికి ఒకసారి మద్యం సేవిస్తున్నారు. ఒక్కొక్కరు సగటున నెలకు 11 క్వార్టర్లు తాగుతున్నారు. కాగా అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా 17.2% మహిళలు మద్యం తాగుతున్నట్లు సర్వేలో తేలింది.

Similar News

News August 9, 2025

ప్రభాస్ ‘రాజాసాబ్’ నిర్మాతకు వార్నింగ్

image

ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు సినీ కార్మికులు వార్నింగ్ ఇచ్చారు. జీతాలు పెంచమని అడిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు తిరగబడితే తట్టుకోలేరని, వెంటనే క్షమాపణలు చెప్పకపోతే ఆయన ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమ్మె తర్వాత కూడా విశ్వప్రసాద్ సినిమాలకు పనిచేయబోమన్నారు. ఆయన అసలు భారతీయుడే కాదని, ఇంగ్లిష్ కల్చర్‌ను తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు.

News August 9, 2025

‘సృష్టి’ కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్

image

AP: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ సోదరుడు, విశాఖ KGH అనస్థీషియా హెడ్ డాక్టర్ రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు వైద్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ నమ్రత అక్రమ కార్యకలాపాల్లో వీరు పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టుల సంఖ్య 30కి చేరింది.

News August 9, 2025

కలాం 1200 మోటార్ ఫస్ట్ స్టాటిక్ టెస్ట్ సక్సెస్: ISRO

image

HYD సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తోన్న విక్రమ్-1 లాంచ్ వెహికల్‌కు సంబంధించి తొలి దశ పూర్తయింది. షార్ సెంటర్‌లో కలాం 1200 మోటార్ ఫస్ట్ స్టాటిక్ టెస్ట్ సక్సెస్ అయినట్లు ISRO ప్రకటించింది. ఈ మోటార్ 11m పొడవు, 1.7m డయా మోనోలిథిక్ కాంపోజిట్ మోటారు, 30 టన్నుల ప్రొపెల్లెంట్ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. స్పేస్ పాలసీలో భాగంగా ఇలాంటి ప్రాజెక్టుల్లో ప్రైవేట్ సంస్థలకు ISRO మార్గనిర్దేశం చేస్తోంది.