News September 4, 2024

ఎంత మంది నష్టపోయారంటే?

image

TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 67వేల మంది నష్టపోయినట్లు సమాచారం. మొత్తం 117 గ్రామాల్లో ఈ నష్టం వాటిల్లింది. బాధితుల్లో ఖమ్మం జిల్లాలోనే 49వేల మంది ఉన్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 44 ఇళ్లు పూర్తిగా మరో 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 51 వంతెనలు, 249 కల్వర్టులు, 166 చెరువులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 13,342 జీవాలు మృతి చెందాయి.

Similar News

News January 11, 2026

సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా: హరీశ్ రావు

image

TG: ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, కమీషన్ల రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ వివరాలను త్వరలో బయటపెడతామన్నారు. ఈ కమీషన్ల దందాపై గవర్నర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘ఓవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో ఇస్తారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రేమో తనకు తెలియదంటారు. ఇదేం పాలన’ అంటూ CM రేవంత్, ప్రభుత్వంపై ఫైరయ్యారు.

News January 11, 2026

చెరకు సాగు-విత్తనం ఎంపికలో జాగ్రత్తలు

image

చీడపీడలు, తెగుళ్లు ఆశించని ఆరోగ్యకరమైన, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. చెరకు గడపైన ఉన్న మూడోవంతు లేత భాగాన్ని మాత్రమే విత్తనంగా ఉపయోగించాలి. గడలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు మాత్రమే, విత్తనం నుంచి మొలక శాతం ఆశాజనకంగా ఉంటుంది. అందువల్ల లేత భాగాలను విత్తనంగా ఉపయోగించటం ఉత్తమం. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల మూడుకళ్ల ముచ్చెలను విత్తనంగా వాడాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 11, 2026

పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే..?

image

దేవుని ప్రసాదంగా పొందిన పసుపును పూజా గదిలో ఉంచి నిత్యం పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నీటిలో కలిపి స్నానం చేస్తే చర్మరోగాలు తొలగి దేహకాంతి పెరుగుతుంది. ఇంటిని పసుపు నీటితో శుద్ధి చేస్తే ఆర్థిక ఇబ్బందులు పోతాయి. వివాహ దోషాలు ఉన్నవారు పసుపు గౌరీని పూజించాలి. వ్యాపార స్థలాల్లో పసుపు నీరు వాడాలి. అనారోగ్య సమస్యలు ఉంటే పసుపు దానం చేయడం శ్రేయస్కరం. ఫలితంగా ఇంట్లో దైవకళ ఉట్టిపడి, సకల శుభాలు కలుగుతాయి.