News September 4, 2024
ఎంత మంది నష్టపోయారంటే?

TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 67వేల మంది నష్టపోయినట్లు సమాచారం. మొత్తం 117 గ్రామాల్లో ఈ నష్టం వాటిల్లింది. బాధితుల్లో ఖమ్మం జిల్లాలోనే 49వేల మంది ఉన్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 44 ఇళ్లు పూర్తిగా మరో 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 51 వంతెనలు, 249 కల్వర్టులు, 166 చెరువులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 13,342 జీవాలు మృతి చెందాయి.
Similar News
News December 4, 2025
నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్ ఆస్తా పూనియా

భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్ పైలట్గా చరిత్ర సృష్టించారు ఆస్తా పూనియా. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని మేరర్కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్ చేశారు. నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఫైటర్ స్ట్రీమ్లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకున్నారామె. ఎంతోమంది యువతులకు రోల్మోడల్గా నిలిచింది.
News December 4, 2025
డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా: జోహో CEO

జోహో సీఈవో శ్రీధర్ వెంబు సూపర్ ఆఫర్ ఇచ్చారు. నైపుణ్యం ఉంటే చాలని.. డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మానాలని భారతీయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో యువత డిగ్రీ వదిలి నేరుగా ఉద్యోగాలను ఎంచుకుంటున్న ధోరణిని ఉదాహరణగా చూపించారు. Zohoలో ఏ ఉద్యోగానికీ డిగ్రీ క్రైటీరియా లేదని తెలిపారు. తనతో పనిచేస్తున్న టీమ్లో సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని అన్నారు.
News December 4, 2025
ఎల్లుండి నుంచి APP పరీక్షల హాల్ టికెట్లు

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల పరీక్షా హాల్ టికెట్లను ఈ నెల 6వ తేదీ ఉ.8గం. నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని TSLPRB ప్రకటించింది. 13వ తేదీ రాత్రి 12గం. వరకు సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనెల 14న రాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉ.10గం. నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గం. వరకు పేపర్-2(డిస్క్రిప్టివ్) ఉంటాయని తెలిపింది.


