News February 13, 2025

కోహ్లీ ఏ జట్టుపై ఎన్ని రన్స్ చేశారంటే?

image

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యధికంగా ఆస్ట్రేలియాపై 5393 పరుగులు (ఆల్ ఫార్మాట్స్) చేశారు. ఆ తర్వాత శ్రీలంక (4076), ఇంగ్లండ్ (4038), వెస్టిండీస్ (3850), సౌతాఫ్రికా (3306), న్యూజిలాండ్ (2915), బంగ్లాదేశ్ (1676), పాకిస్థాన్ (1170), ఆఫ్గానిస్థాన్ (347), జింబాబ్వే (305), నెదర్లాండ్స్ (125), ఐర్లాండ్ (88), హాంగ్ కాంగ్ (59), యూఏఈ (33), స్కాట్లాండ్‌పై 2 రన్స్ చేశారు.

Similar News

News February 13, 2025

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన చికెన్ సేల్స్

image

ఏపీలో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోవడంతో చికెన్ తినడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. HYDలో సేల్ 50% తగ్గిందని వ్యాపారులు తెలిపారు. TGలో వైరస్ వ్యాప్తి లేకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం వల్ల జనం భయందోళన చెందుతున్నారని అంటున్నారు. అయితే చికెన్‌ను 70-100 డిగ్రీల సెల్సియస్ వేడిలో బాగా ఉడికించి తింటే ఏ సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.

News February 13, 2025

బంగారం ధరలు.. తగ్గేదేలే

image

బంగారం ధర మరోసారి రూ.87వేల మార్క్ దాటింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గడంతో రూ.87వేల దిగువకు వచ్చింది. ఇవాళ మళ్లీ రూ.380 పెరగడంతో రూ.87,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 పెరగడంతో రూ.79,800గా నమోదైంది. అటు కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉండే అవకాశం ఉంది.

News February 13, 2025

ఎల్లుండి సెలవా?

image

TG: ఈనెల 15న బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. ఆరోజు పబ్లిక్ హాలిడే ఇవ్వాలని లంబాడాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. గతేడాది ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవు ఇచ్చింది. ఈసారి కూడా దాన్ని అమలు చేయాలని వినతులు వస్తున్నాయి. ఇక సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలంటూ CM రేవంత్‌ను మంత్రి సీతక్క, గిరిజన నాయకులు నిన్న కలిసి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో సెలవుపై CM ఏం నిర్ణయం తీసుకుంటారో.

error: Content is protected !!