News October 16, 2025
50% కోటాలో ఎన్నెన్ని స్థానాలంటే…

TG: సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించరాదని తేటతెల్లమైంది. స్థానిక ఎన్నికలు జరపాలనుకుంటే ఆ పరిధిలో మాత్రమే రిజర్వేషన్లుండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50%లోనే సీట్లు కేటాయించాలి. ప్రస్తుతమున్న12769 పంచాయతీల్లో 6384, MPTC 5745లో 2872, MPP 566లో 283, ZPP 32లో 16 రిజర్వేషన్ల కోటా కిందకు వస్తాయి. ఈ సీట్లలోనే SC, ST, BCలకు సీట్లు రిజర్వు చేయాలి. దీనికి మించి ఉండాలంటే పార్టీ పరంగా ఇవ్వాలి.
Similar News
News October 16, 2025
PHOTO GALLERY: మోదీ ఏపీ పర్యటన

AP: ప్రధాని మోదీ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. తొలుత శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లకు పూజలు చేశారు. అనంతరం గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, భూపతి రాజులతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. మోదీ పర్యటన ఫొటోలను పైన గ్యాలరీలో చూడండి.
News October 16, 2025
3 కొత్త అగ్రికల్చర్ కాలేజీలు.. ఇక్కడే

TG: జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కాలేజీలను నిర్మించనుంది. అటు రూ.10,500 కోట్లతో 5,500 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
News October 16, 2025
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన ఉత్సవాలు.. కొత్త అప్లికేషన్ల స్వీకరణ

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. గ్రామగ్రామాన జరిగే ఈ ఉత్సవాల్లో పలు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఏయే పథకాలకు అప్లికేషన్లు స్వీకరించాలనే అంశంపై రెండు రోజుల్లో సీఎస్ అధ్యక్షతన సమావేశమై వివరాలు వెల్లడించనున్నారు.