News July 8, 2024
చిన్నపిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు ఉద్ధవ్?: మహారాష్ట్ర సీఎం

శివసేన(UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరేపై మహారాష్ట్ర CM ఏక్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమవైపే ఉన్నా ఇంకా శివసేన తమదేనంటూ ఉద్ధవ్ ఎందుకు చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారంటూ ప్రశ్నించారు. ‘పంచాయతీ ఎన్నికల్లో మేం 2వ స్థానంలో ఉంటే ఉద్ధవ్ పార్టీ 6వ స్థానానికి పరిమితమైంది. ఎంపీ ఎన్నికల్లోనూ మాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బాలాసాహెబ్ ఆశయాలను వారు పక్కన పెట్టడం వల్లే ప్రజలు మావైపు నిలుస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
తిరుమలలో తులాభారం గురించి తెలుసా?

తిరుమల కొండపై శ్రీవారి మొక్కుబడులలో తలనీలాల తర్వాత అంతే ముఖ్యమైనది ‘తులాభారం’. ఇది భక్తులు తమ పిల్లల దీర్ఘాయుష్షు కోసం, తమ కోరికలు తీరినందుకు తీర్చుకునే మొక్కుగా భావిస్తారు. బిడ్డ బరువెంతుందో అంతే మొత్తంలో చిల్లర నాణాలు, బెల్లం, చక్కెర, కలకండ, బియ్యంతో తూకం వేసి, ఆ మొత్తాన్ని స్వామివారి హుండీకి సమర్పిస్తారు. ఈ మొక్కును ఆలయ మహద్వారం వద్ద రుసుము చెల్లించి తీర్చుకోవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 9, 2025
తప్పిపోయిన అవ్వను గుర్తించిన మనమడు.. ఎలాగంటే?

అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న 75 ఏళ్ల వృద్ధురాలు(ముంబై) ఇంటి నుంచి బయటకెళ్లి తప్పిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందగా ఆమె మనమడు మాత్రం తన ఆలోచనకు పదును పెట్టాడు. వృద్ధురాలు తాజుద్దీన్ ధరించిన నక్లెస్లో ఉన్న GPSతో ఆమె ఉన్న చోటును ట్రాక్ చేశాడు. బైక్ ఢీకొట్టడం వల్ల ఆస్పత్రిపాలైనట్లు తెలుసుకొని ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాడు. అలా సాంకేతికత ఆమెను తిరిగి కుటుంబానికి దగ్గర చేసింది.
News December 9, 2025
స్థూల సేంద్రియ ఎరువుల ప్రత్యేక ఏమిటి?

స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉంటుంది. వీటి వినియోగంతో నేలలో నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేసే గుణం, నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగుపడతాయి. ఉదాహరణ: పశువుల ఎరువు, కోళ్లు, మేకల విసర్జన పదార్థాల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు మొదలైనవి. ఇవి మన ఊళ్లలోనే దొరుకుతాయి. వాటిని వృథాగా వదిలేయకుండా పొలాల్లో వేస్తే మంచి ఫలితాలు వస్తాయి.


