News May 10, 2024

ఒక ఈవీఎంలో ఎన్ని ఓట్లు వేయొచ్చంటే?

image

ప్రస్తుతం దేశంలో రెండు వెర్షన్‌ల ఈవీఎంలను వినియోగిస్తున్నారు. పాత వెర్షన్ EVM (2000-05 మోడల్)లో గరిష్ఠంగా 3,840 ఓట్లు నిల్వచేయొచ్చు. అదే సమయంలో కొత్త వెర్షన్ EVM (2006 నుంచి వస్తున్న మోడల్)లో గరిష్ఠంగా 2000 ఓట్లను నిల్వ చేయొచ్చు. ఈసీ ప్రకారం కంట్రోల్ యూనిట్‌లో ఎన్నికల ఫలితాలు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

Similar News

News December 8, 2025

సంగారెడ్డి: రేపు రెండో విడత ఎన్నికల నిర్వహణపై శిక్షణ

image

జిల్లాలో ఈనెల 14న జరుగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన శిక్షణ కేటాయించిన మండలాల్లో రేపు నిర్వహిస్తున్నట్లు జిల్లా నోడల్ అధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రెండో విడత ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు ఈ శిక్షణకు హాజరు కావాలని సూచించారు. శిక్షణకు హాజరు కాని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News December 8, 2025

రేణుకా చౌదరికి ప్రివిలేజ్ నోటీసులు

image

TG: పార్లమెంటు సభ్యులపై <<18438395>>అనుచిత<<>> వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరిపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. బ్రిజ్‌లాల్, గోపాలస్వామి ఆమెపై రాజ్యసభ ఛైర్మన్‌కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వాటిని ఆయన ప్రివిలేజ్ కమిటీకి పంపారు. ఇటీవల ఆమె పార్లమెంటుకు పెంపుడు కుక్కను తీసుకెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పరోక్షంగా ఎన్డీఏ సభ్యులను ఉద్దేశిస్తూ కరిచే వాళ్లు లోపల ఉన్నారని వ్యాఖ్యానించారు.

News December 8, 2025

రూ.500 కోట్ల కామెంట్స్.. కాంగ్రెస్ నుంచి సిద్ధూ భార్య సస్పెండ్

image

సీఎం పోస్ట్ కొనుక్కోవడానికి తమ వద్ద రూ.500 కోట్లు లేవంటూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్‌ను పార్టీ నుంచి పంజాబ్ కాంగ్రెస్ తొలగించింది. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అమరిందర్ సింగ్ తెలిపారు. కాగా ఆమె వ్యాఖ్యలు పంజాబ్‌లో తీవ్ర దుమారం రేపడంతో తన కామెంట్స్‌ను వక్రీకరించారని కౌర్ అన్నారు.