News June 5, 2024

షర్మిలకు ఎన్ని ఓట్లు పడ్డాయంటే?

image

AP: కడప పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన YS. షర్మిలకు మొత్తం 1,41,039 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డికి 6,05,143, టీడీపీ అభ్యర్థి భూపేశ్ సుబ్బరామిరెడ్డికి 5,42,448 ఓట్లు పడ్డాయి. అవినాశ్ 62,695 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2.66% ఓట్ షేర్ వచ్చింది.

Similar News

News November 26, 2025

రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ విస్తరణ

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్‌లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్‌లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్‌లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.

News November 26, 2025

రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ విస్తరణ

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్‌లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్‌లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్‌లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.

News November 26, 2025

VZM: 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

image

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.