News June 5, 2024
షర్మిలకు ఎన్ని ఓట్లు పడ్డాయంటే?

AP: కడప పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన YS. షర్మిలకు మొత్తం 1,41,039 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డికి 6,05,143, టీడీపీ అభ్యర్థి భూపేశ్ సుబ్బరామిరెడ్డికి 5,42,448 ఓట్లు పడ్డాయి. అవినాశ్ 62,695 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2.66% ఓట్ షేర్ వచ్చింది.
Similar News
News December 13, 2025
22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

TG స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీజీ సెట్) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. టీజీ సెట్ను 45వేల మంది అభ్యర్థులు రాయనుండగా 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షలు 2 షిఫ్టుల్లో జరగనున్నాయి.
News December 13, 2025
పొదుగు పెద్దగా ఉంటేనే ఎక్కువ పాలు వస్తాయా?

కొందరు గేదెను కొనుగోలు చేసే ముందు దాని పొదుగును చూస్తారు. పెద్ద పొదుగు ఉంటే అది ఎక్కువ పాలు ఇస్తుందని అనుకుంటారు. పెద్ద పొదుగు ఉన్నంత మాత్రాన అది ఎక్కువ పాలు ఇవ్వదు. పాలు పితికిన తర్వాత పొదుగు గాలి తీసిన బెలూన్లా మెత్తగా, ముడతలు పడే గుణం ఉండాలి. అలా కాకుండా పాలు తీశాక కూడా గట్టిగా ఉంటే అది మాంసపు పొదుగుగా గుర్తించాలి. అది ఎక్కువ పాల దిగుబడికి పనికిరాదని భావించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 13, 2025
2026 కల్లా వెలిగొండ పనులు పూర్తి: మంత్రి నిమ్మల

AP: వెలిగొండ పనుల్లో రోజువారీ లక్ష్యాలను పెంచామని, 2026 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు టన్నెల్లో 18KM లోపలి వరకు వెళ్లి పనులను పరిశీలించారు. ప్రస్తుత వర్క్తో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేయడానికి రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని ఆయన చెప్పారు. ఇన్ని పనులుండగా ప్రాజెక్టు పూర్తయిపోయిందని జగన్ జాతికి అంకితం చేయడం ఎంత విడ్డూరమో ఆలోచించాలన్నారు.


