News April 18, 2024
కంచుకోటలోనే మావోలను ఎలా హతమార్చారంటే..

ఛత్తీస్గఢ్లో నక్సల్స్ కంచుకోటైన బినగుండాలోకి ప్రవేశించి 29 మంది మావోలను భద్రతాబలగాలు ఎన్కౌంటర్ చేయడం చర్చనీయాంశమైంది. మావోల అంచనా తప్పడమే ఈ ఎన్కౌంటర్ సక్సెస్కు కారణమని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ‘రేపు లోక్సభ తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మా ఫోకస్ దక్షిణ బస్తర్పై ఉంటుందనుకున్నారు. ఏప్రిల్ 26న కాంకేర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంకా టైమ్ ఉందని భావించారు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2026
నైనీ కోల్ టెండర్లపై CBIతో విచారించాలి: రాంచందర్

TG: నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదంతో CM, మంత్రుల విభేదాలు బట్టబయలయ్యాయని TBJP చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. ‘బంధువులకు గనులు కేటాయించుకోవాలని చూశారు. మీడియాలో వార్తలతో టెండర్లు రద్దు చేశారు. దీనిపై CBI, మరేదైన సంస్థతో విచారించాలి’ అని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే అర్హత BRSకు లేదన్నారు. BRS హయాం నుంచి ఇప్పటి INC GOVT వరకు జరిగిన అవినీతిపై విచారణ జరగాలని పేర్కొన్నారు.
News January 20, 2026
ఆ దేశాలనూ అమెరికాలో కలిపేసిన ట్రంప్!

యూరోపియన్ దేశాలు, US మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ట్రంప్ రిలీజ్ చేసిన AI జనరేటెడ్ మ్యాప్ వైరల్ అవుతోంది. అందులో కెనడా, గ్రీన్లాండ్, వెనిజులా US భూభాగానికి చెందినవి అన్నట్లు ఉంది. ఈ ఫొటోను ఆయన ట్రూత్లో పోస్ట్ చేశారు. గతేడాది EU లీడర్లతో ట్రంప్ భేటీ కాగా, అప్పటి ఫొటోను మార్ఫ్ చేశారు. ఆ సమయంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్, ఇటలీ PM మెలోని, UK PM కీర్ స్టార్మర్ తదితరులతో ట్రంప్ సమావేశమయ్యారు.
News January 20, 2026
రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలా?

ప్రతి ఒక్కరూ రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగాలనే నియమానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని డాక్టర్లు చెబుతున్నారు. నీటి అవసరం అనేది మనిషి బరువు, చేసే పని, ఉండే వాతావరణంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అందరికీ ఒకే లెక్క సరిపోదని, మన శరీరానికి నీరు కావాలనిపించినప్పుడు ‘దాహం’ రూపంలో సంకేతం ఇస్తుందని వివరించారు. అందువల్ల దాహం వేయకపోయినా బలవంతంగా నీళ్లు తాగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. SHARE IT


