News November 30, 2024
మీరెంత? నా కాలి గోటితో సమానం: రేవంత్

TG: BRS సహా తాను ఎవరి బెదిరింపులకు భయపడనని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘నేను భయపడితే ఇంత దూరం రాను. పుట్టింది, పెరిగింది నల్లమల్ల అడవుల్లో. పులులను చూశా. అడవిలో ఉండే మృగాలను చూశా. తోడేళ్లను చూశా. అన్నింటినీ ఎదుర్కొని ఇంత దూరం వచ్చా. మానవ మృగాలు మీరెంత? నా కాలు గోటితో సమానం. నేను ప్రభుత్వాన్ని పాలించే పనిలో పడితే.. అలుసుగా తీసుకుని BRS విమర్శిస్తోంది. ప్రజలే వారికి సమాధానం చెప్పాలి ‘ అని CM అన్నారు.
Similar News
News December 19, 2025
మెస్సీ ఈవెంట్.. రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసిన గంగూలీ

నిర్వహణ లోపం వల్ల కోల్కతాలో ఫుట్బాల్ స్టార్ మెస్సీ ఈవెంట్ రద్దైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఈవెంట్కు మధ్యవర్తిగా వ్యవహరించారన్న AFCK ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహా ఆరోపణలపై సౌరభ్ గంగూలీ పరువు నష్టం దావా వేశారు. నిరాధారమైన సాహా వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని రూ.50 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తనకు ఈవెంట్తో ఎలాంటి సంబంధం లేదని, కేవలం గెస్ట్గా హాజరయ్యానని ఆయన స్పష్టం చేశారు.
News December 19, 2025
మూడు నెలల్లో ఒకే గ్రామంలో 27వేల జననాలు.. తీరా చూస్తే!

MH యావత్మల్(D) శేందుర్సనీ GPలో గత మూడు నెలల వ్యవధిలో ఏకంగా 27,397 జననాలు నమోదవ్వడం కలకలం రేపింది. 1,500 మంది ఉండే ఈ గ్రామంలో ఈ సంఖ్యలో జననాలు ఉండటం సైబర్ కుట్రగా అధికారులు భావిస్తున్నారు. వీటిలో 99శాతం ఎంట్రీలు వెస్ట్ బెంగాల్, UP నుంచే ఉన్నాయని BJP నేత కిరీట్ సోమయ్య అన్నారు. ఈ విషయంపై CMతో మాట్లాడి బర్త్ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. కాగా దీనిపై కేసు నమోదైంది.
News December 19, 2025
e-KYC లేకపోయినా బియ్యం పంపిణీ: పౌరసరఫరాల శాఖ

TG: రేషన్కార్డుదారులు ఈ నెల 31లోగా e-KYC చేయించుకోకపోతే సన్నబియ్యం నిలిపేస్తారనే ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. e-KYC తప్పనిసరి అని, అయితే దీనికి తుది గడువు ఏమీ లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర తెలిపారు. బియ్యం పంపిణీని ఆపబోమని స్పష్టం చేశారు. కార్డులో పేరు ఉన్నవారు ఒక్కసారైనా రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు, ఐరిష్ ఇవ్వాలని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు.


