News January 6, 2025
రాష్ట్రంలోని ఆలయాల్లో ఎంత బంగారం ఉందంటే?

TG: రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కలిపి 1,048 కేజీల బంగారం, 38,783 కేజీల వెండి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా వేములవాడ రాజన్న ఆలయానికి 97kgs బంగారం సమకూరిందని తెలిపారు. తర్వాతి స్థానాల్లో భద్రాచలం (67), యాదగిరి గుట్ట (61) ఉన్నాయి. ఈ బంగారం ఆయా ఆలయాల పరిధిలోనే ఉంటుందని, కానుకల రూపంలో వచ్చిన బంగారాన్ని మాత్రమే ఆలయ అవసరాల కోసం ప్రభుత్వ అనుమతితో కరిగిస్తారని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News December 16, 2025
42% రిజర్వేషన్ల సాధనకు పోరాడుతూనే ఉంటాం: సీతక్క

TG: బీసీ కులగణన ప్రకారం 42% రిజర్వేషన్ల సాధన టార్గెట్గా కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో 2 విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పారు. సమ్మక్క-సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు కామెంట్లు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించబోదని హెచ్చరించారు.
News December 16, 2025
ఇంటర్నెట్ కింగ్ ‘Chrome’.. మార్కెట్లో 70% వాటా!

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్రౌజర్ మార్కెట్లో గూగుల్ క్రోమ్ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుతోంది. ‘STAT COUNTER’ విడుదల చేసిన NOV-2025 డేటా ప్రకారం.. 70% కంటే ఎక్కువ మంది యూజర్లు క్రోమ్నే వాడుతున్నారు. దీని తర్వాత సఫారీ(14.35%), EDGE(4.98%), ఫైర్ఫాక్స్(2.3%), ఒపెరా(1.89%), శామ్సంగ్ ఇంటర్నెట్(1.86%), మిగిలినవి(3.4%) ఉన్నాయి. మీరు ఏ బ్రౌజర్ ఎక్కువగా వాడతారు? COMMENT
News December 16, 2025
పోలీసులను బెదిరిస్తే ఊరుకోం: పవన్

AP: పోలీసు ఉన్నతాధికారులను మాజీ సీఎం బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పోలీసులను బెదిరిస్తే తమ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్పై కేసులు వేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మంగళగిరిలో కానిస్టేబుల్స్ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ మంత్రి నారా లోకేశ్ లేని లోటు కనిపిస్తోందని చెప్పారు.


