News January 7, 2025

నిన్నటితో పోలిస్తే బంగారం ఎంత పెరిగిందంటే..

image

బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. డాలర్ విలువ పెరుగుతుండటమే ఇందుకు కారణం. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.51 పెరిగి రూ.81,789గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.47 ఎగిసి రూ.74,973 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.1,00,000 వద్ద ఉంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.70 ఎగిసి రూ.25,740 వద్ద ట్రేడవుతోంది. మరికొన్ని రోజులు ధరలు ఇలాగే కొనసాగొచ్చని నిపుణులు చెప్తున్నారు.

Similar News

News December 7, 2025

NDMAలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (<>NDMA<<>>) 4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ(ఫారెస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, రిమోట్ సెన్సింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్, అట్మాస్పియరిక్ సైన్స్, జియోగ్రఫీ), ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ndma.gov.in./

News December 7, 2025

అత్యాచార బాధితుల కోసం ఓ యాప్

image

ప్రస్తుతకాలంలో చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. వీటితో పిల్లలకు ఎంతో మనోవ్యధ కలుగుతోంది. దీన్ని తగ్గించడానికి కేంద్రం POCSO e-box యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిర్యాదు చేస్తే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నేరస్తులకు శిక్ష పడే వరకు ఈ యాప్ సేవలు అందిస్తుంది. ఈ యాప్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కేసు అప్డేట్స్ కూడా ఇందులో తెలుసుకొనే వీలుంటుంది.

News December 7, 2025

విస్తరిస్తోన్న మార్బర్గ్ వైరస్.. 8 మంది మృతి

image

దక్షిణ ఇథియోపియాలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్ 3 నాటికి 13 కేసులు నమోదుకాగా అందులో 8 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఈ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినదిగా, మరణాల రేటు 88% వరకు ఉండొచ్చని WHO తెలిపింది. ప్రస్తుతం టీకా లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.