News February 11, 2025
ఏ బీరుపై ఎంత రేటు పెరిగిందంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739281647186_695-normal-WIFI.webp)
TG: రాష్ట్రంలో బీర్ల ధరలు ఇవాళ్టి నుంచి 15% పెరిగాయి. KF స్ట్రాంగ్ రేటు రూ.160 నుంచి రూ.184కు, లైట్ రూ.150 నుంచి రూ.172కు, అల్ట్రా మాక్స్ రూ.220 నుంచి రూ.253కు చేరాయి. అలాగే బడ్వైజర్ లైట్ రూ.210 నుంచి రూ.241కు, మ్యాగ్నం రూ.220 నుంచి రూ.253కు, టుబర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుంచి రూ.276కు పెరిగాయి. ఈ పెంపుతో ప్రభుత్వానికి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.
Similar News
News February 12, 2025
HEADLINES
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739294519681_653-normal-WIFI.webp)
* గత ఐదేళ్ల విధ్వంసంతో వెనుకబడ్డాం: CM చంద్రబాబు
* పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఖాయం: KCR
* ఈ జన్మకు రాజకీయాలకు దూరంగా ఉంటా: చిరంజీవి
* కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: KTR
* తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు
* జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
* ఏపీ, టీజీలో విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ.. ప్రభుత్వాలు అప్రమత్తం
News February 12, 2025
రోహిత్, కోహ్లీ వారిద్దరితో మాట్లాడాలి: కపిల్ దేవ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739294530543_1045-normal-WIFI.webp)
భారత స్టార్లు కోహ్లీ, రోహిత్ మాజీ ప్లేయర్లతో మాట్లాడాలని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సూచించారు. రోహిత్ గత వన్డేలో సెంచరీ చేశారు. అయితే ఆయన, కోహ్లీ టెస్టుల్లో ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నారు. ‘వయసవుతున్న మాత్రాన రోహిత్, కోహ్లీ ఒక్కసారిగా ఆటను మర్చిపోరు. కానీ వారి శరీరం అడ్జస్ట్ చేసుకునే తీరు మారుతుంటుంది. దీనిపై గవాస్కర్, ద్రవిడ్ వంటివారితో ఆ ఇద్దరూ మాట్లాడాలి’ అని కపిల్ పేర్కొన్నారు.
News February 12, 2025
పబ్లిక్లో పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదు: ఢిల్లీ కోర్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739285506634_695-normal-WIFI.webp)
బార్లో అశ్లీల నృత్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బహిరంగంగా పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదంది. వారి డాన్స్ ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పొట్టి దుస్తులు ధరించి అశ్లీల డాన్స్ చేశారంటూ గత ఏడాది పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనివల్ల ఇబ్బందిపడిన సాక్షులను ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.