News October 23, 2024
నీతా అంబానీ నీటి సీసా విలువ ఎంతంటే…
రిలయన్స్ అధినేత ముకేశ్ భార్య నీతా అంబానీ నీళ్లు తాగేందుకు 24 క్యారట్ల బంగారు సీసాను వాడతారని వారి సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. ఆ వివరాల ప్రకారం.. డిజైనర్ ఫెర్నాండో ఆల్టమిరానో రూపొందించిన ఆ బాటిల్ విలువ రూ.49 లక్షల వరకూ ఉంటుంది. అందులో తాగే నీటిని ఫ్రాన్స్, ఫిజీ, ఐస్లాండ్ దేశాల్లో ప్రకృతిసిద్ధంగా లభించే నీటిని తెప్పించుకుంటారు. అగ్ర కుబేరుడి భార్య అంటే మెయింటెనెన్స్ ఆమాత్రం ఉంటుందిగా!
Similar News
News October 23, 2024
ఇండియాలోనే అత్యంత నెమ్మదైన రైలు ఏదంటే..
హౌరా-అమృత్సర్ రైలుకు అత్యంత నెమ్మదిగా గమ్యం చేరే రైలుగా పేరుంది. 111 స్టేషన్లలో ఆగుతూ వెళ్లడం వల్ల ఆఖరి స్టేషన్కు చేరుకునేందుకు 37 గంటలు పడుతుంటుంది. బెంగాల్, బిహార్, యూపీ, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా 1910 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈరోజు రాత్రి 7.15 గంటలకు హౌరా స్టేషన్లో బయలుదేరితే ఎల్లుండి ఉదయం 8.40 గంటలకు అమృత్సర్ చేరుతుంది. టికెట్ ధర తక్కువే కావడంతో ఈ రైలుకు డిమాండ్ ఎక్కువే.
News October 23, 2024
నాకు సొంత ఇల్లు కూడా లేదు: కర్ణాటక సీఎం
ముడా స్కాంపై తనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తానెప్పుడూ నిజాయతీతో కూడిన రాజకీయాలే చేశానని అన్నారు. సీఎం అయినప్పటికీ తనకు సొంత ఇల్లు కూడా లేదని చెప్పారు. మైసూరులో కువెంపు రోడ్డులో ఉన్న ఇల్లు తప్ప మరే ఆస్తి తనకు లేదని, ఆ ఇంటి నిర్మాణం కూడా ఇంకా పూర్తి కాలేదన్నారు. వెనకబడిన వర్గానికి చెందిన తాను రెండోసారి సీఎం కావడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని దుయ్యబట్టారు.
News October 23, 2024
Singam Again: షూట్లో చుల్బుల్ పాండే!
సింగం ఫ్రాంచైజీలో వస్తున్న సింగం అగైన్లో సల్మాన్ స్పెషల్ క్యామియో కన్ఫార్మ్ అయ్యింది. సూపర్ కాప్ నేపథ్యమున్న ఈ చిత్రంలో దబాంగ్లో సల్మాన్ నటించిన చుల్బుల్ పాండే పాత్రనే ఈ సినిమాలోనూ చేసినట్టు సమాచారం. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వస్తున్నా అజయ్ దేవగణ్, రోహిత్ శెట్టిలకు ఇచ్చిన మాట ప్రకారం సల్మాన్ మంగళవారం షూటింగ్లో పాల్గొన్నట్టు తెలిసింది.