News March 20, 2024
ఐపీఎల్, పీఎస్ఎల్ ప్రైజ్ మనీ ఎంతంటే…

IPLకు పోటీగా పాక్ క్రికెట్ బోర్డు PSLను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండు టోర్నీల్లో ప్రైజ్ మనీ తేడా ఎంత? ఐపీఎల్లో గత ఏడాది విజేతలకు రూ. 20 కోట్ల ప్రైజ్మనీ దక్కింది. రన్నరప్కు రూ.13 కోట్లు లభించాయి. అదే పీఎస్ఎల్లో ఇటీవల విజేతలుగా నిలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్కు మన కరెన్సీలో రూ. 4.15 కోట్లు దక్కాయి. WPLలో ఆర్సీబీకి వచ్చిన ప్రైజ్మనీ(రూ.6 కోట్లు) అంతకంటే ఎక్కువే కావడం ఆసక్తికరం.
Similar News
News January 5, 2026
చైనాను గట్టి దెబ్బ కొట్టిన అమెరికా!

సోషలిస్ట్ దేశమైన వెనిజులాలో చైనా రూ.లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టింది. ఎనర్జీ నుంచి స్పేస్ వరకు కీలక భాగస్వామిగా ఉంటూ రూ.వేల కోట్లు అప్పుగా ఇచ్చింది. ద్రవ్యోల్బణంతో వెనిజులా వాటిని తీర్చలేని దుస్థితిలో ఉంటే తక్కువ ధరకే ఆయిల్ దిగుమతి చేసుకుంటూ లబ్ధి పొందుతోంది. తాజాగా యూఎస్ జోక్యంతో అక్కడ మదురో పాలన అంతమైంది. దీంతో వెనిజులాలో చైనా పెట్టుబడులు, ఆయిల్ దిగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
News January 5, 2026
గంట మోగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మాత్రమే గంట కొట్టాలి. తిరిగి వచ్చేటప్పుడు కొట్టకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు గంటను ఎడమ చేతితో పట్టుకుని లయబద్ధంగా మోగించాలి. అనవసరంగా, పదేపదే కొట్టకూడదు. 2,3 సార్లు స్పష్టంగా మోగించడం శ్రేయస్కరం. రాత్రి సమయాల్లో గంటను బిగ్గరగా మోగించకూడదు. ఈ నియమాలను పాటిస్తే దేవతల ఆవాహన జరగడమే కాకుండా, ఆ ప్రతిధ్వని ద్వారా మనసు ఏకాగ్రతను పొంది ఇంట్లో సానుకూల ప్రకంపనలు వ్యాపిస్తాయి.
News January 5, 2026
AERAIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<


