News April 13, 2025
మటన్ను ఎంత తినాలి?

నాన్వెజ్ ప్రియులు మటన్ను ఇష్టంగా తింటారు. అయితే, అందులో కొవ్వులు ఎక్కువ ఉండటం వల్ల తగిన మోతాదులోనే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి వారానికి గ్రా.300, శారీరక శ్రమ చేసేవారు గ్రా.500 తినొచ్చని చెబుతున్నారు. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు గ్రా.100 మించి తినకూడదు. అలాగే, సరిగా ఉడకని మటన్ తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొందరికి అజీర్తి ఏర్పడి విరేచనాలు అవుతాయి.
Similar News
News January 11, 2026
ఇంటి చిట్కాలు మీ కోసం

* స్టెయిన్ లెస్ స్టీల్ సింకులు మెరుపు తగ్గకుండా ఉండాలంటే, వెనిగర్లో ముంచిన స్పాంజ్తో శుభ్రం చెయ్యాలి.
* ఓవెన్లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు దూరమవుతాయి.
* నూనె డబ్బాల మీద బంగాళా దుంప ముక్కలతో రుద్దితే తుప్పు మరకలు రాకుండా ఉంటాయి.
* నీటిలో కాస్త వెనిగర్, లిక్విడ్ డిష్వాష్ కలిపి, దానిలో ముంచిన వస్త్రంతో కిటికీలను తుడిస్తే పేరుకున్న దుమ్ముపోతుంది.
News January 11, 2026
NSUTలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT)లో 31 టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 3వరకు పంపాలి. BE/BTech/BS/ME/MTech/MS, M.Arch, MBA/PGDM/CA/ICWA/M.Com, PhD ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. అసోసియేట్ ప్రొఫెసర్కు 50ఏళ్లు. సైట్: https://nsut.ac.in
News January 11, 2026
సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా: హరీశ్ రావు

TG: ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, కమీషన్ల రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ వివరాలను త్వరలో బయటపెడతామన్నారు. ఈ కమీషన్ల దందాపై గవర్నర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘ఓవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో ఇస్తారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రేమో తనకు తెలియదంటారు. ఇదేం పాలన’ అంటూ CM రేవంత్, ప్రభుత్వంపై ఫైరయ్యారు.


