News November 26, 2024
రూ.27 కోట్లలో రిషభ్ చేతికి వచ్చేది ఎంతంటే..

IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషభ్ పంత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. లక్నో అతడిని రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దీనిలో రూ.8.1 కోట్లు పన్నుగా వెళ్లిపోగా పంత్ చేతికి రూ.18.9 కోట్లు అందుతాయి. ఒకవేళ టోర్నీకి ముందే గాయపడినా, వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్నా ఆ డబ్బు రాదు. టోర్నీ మధ్యలో గాయపడి తప్పుకుంటే మాత్రం చెల్లిస్తారు. భారత మ్యాచ్లకు ఆడుతూ గాయపడినా డబ్బు దక్కుతుంది.
Similar News
News October 15, 2025
జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం?

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీకి ప్రోత్సహించింది రమేశే అని A-1 జనార్దన్ రావు చెప్పడంతో ఎక్సైజ్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మద్యం పట్టుబడిన ANR గోడౌన్ పరిసరాల సీసీ ఫుటేజిని పరిశీలించారు. కాగా జనార్దన్ రావుతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని జోగి రమేశ్ స్పష్టం చేశారు.
News October 15, 2025
ఏపీ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

ఏపీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఎన్టీఆర్ జిల్లా నుంచి 20 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://ntr.ap.gov.in/
News October 15, 2025
తాజా రౌండప్

* TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మూడో రోజు 11 నామినేషన్లు.. మొత్తంగా 32 నామినేషన్లు దాఖలు
* రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా 200 సెంటర్లలో మొక్కజొన్న పంట కొనుగోళ్లు
* బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: రఘోపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
* వరుస నష్టాలకు బ్రేక్.. నిఫ్టీ 178 పాయింట్లు, సెన్సెక్స్ 575 పాయింట్లు అప్