News April 10, 2024

ఏ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లున్నాయి?: CPM

image

TG: నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న వేళ ప్రభుత్వానికి CPM పార్టీ లేఖ రాసింది. ఏ రిజర్వాయర్‌లో ఎన్ని నీళ్లున్నాయో చెప్పాలని కోరింది. ఈ మేరకు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. మేడిగడ్డ కుంగిన నేపథ్యంలో పంటలకు నీరందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పంటలు ఎండిపోకుండా కాపాడటంతో పాటు ఇప్పటికే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసింది.

Similar News

News October 17, 2025

రేపటి బంద్‌లో అందరూ పాల్గొనాలి: భట్టి

image

TG: BCలకు రిజర్వేషన్లపై నిర్వహించే బంద్‌లో అందరూ పాల్గొనాలని Dy.CM భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ‘BRS రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసి BC కోటాను తగ్గించింది. మేం సైంటిఫిక్ సర్వే లెక్కల ప్రకారం 42% కల్పించాం. బిల్లును ఆమోదించి పంపినా కేంద్రం ఆమోదించడం లేదు. అందుకే రిజర్వేషన్ల పెంపు కోర్టుల్లో నిలిచిపోతోంది. BJP నైజం బయటపడింది. వారిప్పుడు మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరు’ అని భట్టి అన్నారు.

News October 17, 2025

​స్కాలర్​షిప్.. రేపే లాస్ట్ డేట్

image

​నేషనల్​ మీన్స్​ కమ్​ మెరిట్​ స్కాలర్​షిప్​ స్కీమ్(NMMSS-2026)కు దరఖాస్తు చేసేందుకు రేపే చివరి తేది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నవారు రేపటి లోగా ఆన్​లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించాలి. OCT​ 22లోగా ఆన్​లైన్​‌లో అప్లై చేసిన ఫామ్‌ను సంబంధిత పాఠశాల HMలు DEOలకు పంపించాల్సి ఉంటుంది. ఈ స్కీం ద్వారా ఆర్థికంగా వెనకబడిన మెరిట్ స్టూడెంట్స్​కు 9వ తరగతి నుంచి ఇంటర్​ వరకు ఏటా రూ.12వేల స్కాలర్​షిప్​ అందజేస్తారు.

News October 17, 2025

చరిత్రలో తొలిసారి.. అరుణిమకు అరుదైన గౌరవం

image

ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి అరుణిమ కుమార్‌కు యూకేలో అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ రాజు ఛార్లెస్-3 ఆమెను ‘బ్రిటిష్ ఎంపైర్ మెడల్’తో సత్కరించారు. కూచిపూడి నర్తకి ఈ గౌరవం పొందడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇది భారతీయ నాట్యానికి దక్కిన గుర్తింపు అని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో పుట్టిన అరుణిమ ప్రస్తుతం యూకేలో నివాసం ఉంటున్నారు. తన డాన్స్ అకాడమీ ద్వారా ఇప్పటిదాకా 50+ దేశాల్లో 3వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.