News July 12, 2024
ఇదెక్కడి విడ్డూరం.. 40 రోజుల్లో 7సార్లు కాటేసిన పాము

యూపీలోని ఫతేపూర్లో విచిత్ర ఘటన జరిగింది. 24 ఏళ్ల వికాస్ దూబేను 40 రోజుల్లో ఏడు సార్లు పాము కాటేసింది. జిల్లాలోని సౌరా గ్రామానికి చెందిన దూబే జూన్ 2 నుంచి జూలై 6 మధ్య ఆరుసార్లు పాము కాటుకు గురయ్యాడు. ఏడవ కాటు తర్వాత ఆయన తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యాడు. పాము కాట్లు ఎల్లప్పుడూ శనివారం, ఆదివారాల్లోనే జరిగాయని దూబే తెలిపారు. వేరే ప్రాంతాలకు వెళ్లి ఉన్నా అతనిని పాముకాట్లు వెంటాడుతున్నాయి.
Similar News
News November 24, 2025
ముగిసిన జీ20 సమ్మిట్.. తిరుగు పయనమైన మోదీ

సౌతాఫ్రికా వేదికగా జరిగిన జీ20 సమ్మిట్ ముగిసింది. దీంతో ప్రధాని మోదీ భారత్కు తిరుగు పయనమయ్యారు. సదస్సు విజయవంతగా ముగిసిందని ఆయన ట్వీట్ చేశారు. వివిధ దేశాధినేతలతో ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. సమ్మిట్ చివరిరోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీ అయ్యారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా అడ్డుకోవడానికి ఇరుదేశాలు ఉమ్మడిగా పోరాడాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
News November 24, 2025
విభూది ఎందుకు ధరించాలి?

పరమ శివుడికి విభూది అంటే చాలా ఇష్టం. దీన్నే భస్మం అని కూడా అంటారు. భస్మం మన పాపాలను ప్రక్షాళన చేస్తుందని నమ్ముతారు. హోమంలో భగవంతునికి సమర్పించిన గంధపు చెక్కలు, నెయ్యి, ఇతర ఔషధాల నుంచి భస్మం తయారవుతుంది. దీన్ని ధరిస్తే.. జనన మరణ పరిధుల నుంచి బయటపడతామని, అహంకారం అంతమవుతుందని నమ్ముతారు. అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News November 24, 2025
నేటి నుంచి రాష్ట్రంలో ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం

AP: వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి 29వ తేదీ వరకు ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో ప్రభుత్వం పంచ సూత్రాల విధానాన్ని ప్రవేశపెట్టింది. వీటి అమలుతో సాగులో కలిగే మేలుపై రైతుల ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఆక్వా, ఉద్యాన అధికారులు వివరించనున్నారు.


