News October 26, 2024
చైనాతో ఒప్పందం ఎలా సాధ్యమైందంటే..: ఎస్ జైశంకర్
తూర్పు లద్దాక్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ ఉపసంహరణ విషయంలో చైనా, భారత్ మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రెండు అంశాలు ఆ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. ‘మన సైన్యం అత్యంత కష్టమైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో నిలబడింది. ఒప్పందం వెనుక భారత సైన్యమే తొలి కారణం. ఇక సరిహద్దు వెంబడి దశాబ్దకాలంగా మనం అభివృద్ధి చేసుకున్న మౌలిక వసతులు రెండో కారణం’ అని వివరించారు.
Similar News
News October 26, 2024
తెలుగు టైటాన్స్కు మరో ఓటమి
ప్రో-కబడ్డీ లీగ్ 2024లో తెలుగు టైటాన్స్కు మరో ఓటమి ఎదురైంది. దబాంగ్ ఢిల్లీతో జరిగిన హోరా హోరీ పోరులో 37-41 పాయింట్లతో ఓడిపోయింది. ఢిల్లీ ప్లేయర్లలో నవీన్, అషు మాలిక్ తలో 15 పాయింట్లు చేయగా TT కెప్టెన్ పవన్ షెరావత్ ఏకంగా 18 పాయింట్లు చేయడం గమనార్హం. కాగా తెలుగు టైటాన్స్కు ఇది వరుసగా మూడో ఓటమి.
News October 26, 2024
లారెన్స్ బిష్ణోయ్ తరఫున నామినేషన్ వేస్తాం: UBVS పార్టీ
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను ఎన్నికల్లో పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతని తరఫున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు AB ఫారం ఇవ్వాలంటూ UBVS పార్టీ నేత సునీల్ శుక్లా ROకి లేఖ రాశారు. బాంద్రా వెస్ట్ నుంచి బిష్ణోయ్ను పోటీకి దింపుతామని, నామినేషన్ ఫారం ఇస్తే అతని సంతకం తీసుకొస్తానని శుక్లా పేర్కొన్నారు. హత్యకు గురైన సిద్ధిఖీ గతంలో ఇక్కడ MLAగా గెలుపొందారు.
News October 26, 2024
ఛార్జింగ్ పెట్టి నిద్రపోయాడు.. షాక్ కొట్టి మృతి
TG: కామారెడ్డి(D) సదాశివనగర్లో విషాదం చోటు చేసుకుంది. యాచారం తండాకు చెందిన మాలోత్ అనిల్ పడుకునే ముందు మొబైల్కు ఛార్జింగ్ పెట్టాలనుకున్నాడు. సాకెట్ దూరంగా ఉండటంతో ఎక్స్టెన్సన్ బాక్స్ పక్కనే పెట్టుకుని ఛార్జింగ్ పెట్టాడు. నిద్రలో బాక్స్పై కాలు వేయడంతో షాక్ కొట్టి మరణించినట్లు పోలీసులు తెలిపారు. అనిల్కు భార్య, ఏడాదిన్నర కూతురు ఉన్నారు.
* ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.