News October 13, 2025
TTD డైరీలు, క్యాలెండర్లను ఆన్లైన్లో ఎలా కొనుగోలు చేయాలంటే?

తిరుమల తిరుపతి దేవస్థానం 2026 సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లోనూ అందుబాటులోకి తెచ్చింది. భక్తులు www.tirumala.org లేదా ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు టీటీడీ తపాలా శాఖ ద్వారా ఇంటి వద్దకే వాటిని చేరవేసే సౌలభ్యాన్ని కల్పించింది. ఈ వెబ్సైట్లలోనే సప్తగిరి మ్యాగజైన్ కూడా అందుబాటులో ఉంది.
Similar News
News October 13, 2025
రెండో టెస్టు.. భారత్ టార్గెట్ ఎంతంటే?

రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ 390 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ క్యాంప్బెల్(115), షై హోప్(103) సెంచరీలు చేశారు. చివరి వికెట్కు గ్రీవ్స్(50*), సీల్స్ (32) అద్భుతంగా పోరాడి 79 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో WI భారత్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా చెరో 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు.
News October 13, 2025
ఎకనామిక్ సైన్సెస్లో ముగ్గురికి నోబెల్

ఎకనామిక్ సైన్సెస్లో జోయెల్ మోకైర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోయిట్ను నోబెల్ ప్రైజ్ వరించింది. ఇన్నోవేషన్ ఆధారిత ఎకనామిక్ గ్రోత్ను వివరించినందుకు గాను వారికి ఈ పురస్కారం దక్కింది. ప్రైజ్లో మోకైర్కు అర్ధభాగం, అగియోన్, పీటర్కు సంయుక్తంగా మరో అర్ధభాగాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ఇప్పటికే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, <<17966688>>పీస్<<>>, లిటరేచర్ అవార్డులు ప్రకటించడం తెలిసిందే.
News October 13, 2025
ఏపీ అప్డేట్స్

☛ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగింపు.. న్యూయార్క్ వెళ్లేందుకు MP మిథున్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా.. కౌంటర్ దాఖలు చేయాలని సిట్కు కోర్టు ఆదేశం
☛ రేపు, ఎల్లుండి రాజస్థాన్ ఉదయ్పుర్లో మంత్రి దుర్గేశ్ పర్యటన.. నేషనల్ టూరిజం కాన్ఫరెన్స్లో పాల్గొననున్న మంత్రి
☛ పశుసంవర్ధక శాఖలో 157 మంది ల్యాబ్ టెక్నీషియన్ల కాంట్రాక్టు సర్వీసులు మరో ఏడాది పాటు పొడిగింపు