News October 8, 2024
కొనేదెలా? వండేదెలా? అమ్మేదెలా?

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. ప్రతి కూరలోకి పక్కా అన్నట్లుండే ఉల్లి Kg ₹60, టమాటా ₹100కు చేరడంతో ఇవి లేకుండా అసంతృప్తిగా తింటున్నారు. ఇక కర్రీ పాయింట్ నిర్వాహకుల పాట్లు మరోలా ఉన్నాయి. కూరల రేట్లు పెంచితే కొనేవారు తగ్గుతున్నారని వారు వాపోతున్నారు. అటు నవరాత్రులతో చాలాచోట్ల అన్నదానాలు జరుగుతుండటంతో, అమ్మ దయతో పొట్ట నింపుకుంటున్నట్లు బ్యాచిలర్స్ చెబుతున్నారు.
Similar News
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.
News December 5, 2025
పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వర్తించదు.


