News October 8, 2024
కొనేదెలా? వండేదెలా? అమ్మేదెలా?

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. ప్రతి కూరలోకి పక్కా అన్నట్లుండే ఉల్లి Kg ₹60, టమాటా ₹100కు చేరడంతో ఇవి లేకుండా అసంతృప్తిగా తింటున్నారు. ఇక కర్రీ పాయింట్ నిర్వాహకుల పాట్లు మరోలా ఉన్నాయి. కూరల రేట్లు పెంచితే కొనేవారు తగ్గుతున్నారని వారు వాపోతున్నారు. అటు నవరాత్రులతో చాలాచోట్ల అన్నదానాలు జరుగుతుండటంతో, అమ్మ దయతో పొట్ట నింపుకుంటున్నట్లు బ్యాచిలర్స్ చెబుతున్నారు.
Similar News
News November 3, 2025
పాపికొండల బోటింగ్ షురూ

AP: పాపికొండల బోటింగ్ మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద నిన్న రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటులో షికారుకెళ్లారు. వాస్తవానికి దీపావళికి ముందే ఈ బోటింగ్ ప్రారంభమైనప్పటికీ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. తాజాగా సాధారణ వాతావరణం ఉండటంతో అధికారులు అనుమతిచ్చారు. కార్తీక మాసం కావడంతో తిరిగి పర్యాటకుల తాకిడి పెరగనుంది.
News November 3, 2025
ఈ వరి రకం.. ముంపు ప్రాంత రైతులకు వరం

MTU 1232.. ఇది 15 నుంచి 20 రోజుల పాటు వరద ముంపును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే వరి రకం. పంటకాలం 140 రోజులు. పైరు తక్కువ ఎత్తు పెరిగి, గింజ సన్నగా ఉంటుంది. బియ్యం శాతం అధికం. దోమ పోటు, అగ్గి తెగులు, మాగుడు తెగులును తట్టుకుంటుంది. ఇది పడిపోదు, గింజ రాలదు. ఎకరాకు సాధారణ భూమిలో 40 బస్తాలు, ముంపు ప్రాంతాల్లో 30-35 బస్తాల దిగుబడినిస్తుంది. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 3, 2025
బాడీ స్ప్రే ఎక్కువగా వాడుతున్నారా?

చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకునేందుకు కొందరు, మంచి సువాసన కోసం మరికొందరు బాడీ స్ప్రేలు వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల పలు సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే రసాయనం వల్ల దీర్ఘకాలంలో కాంటాక్ట్ డెర్మటైటీస్, హైపర్ పిగ్మెంటేషన్, గ్రాన్యూలోనూ వంటి చర్మవ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్, పారాబెన్ లేని వాటిని వాడాలని సూచిస్తున్నారు.


