News May 23, 2024
పునుగు పిల్లి నుంచి నూనె ఎలా తీస్తారంటే..

వేల ఏళ్ల నాటి శ్రీనివాసుడి విగ్రహం నేటికీ కాంతులీనడం వెనుక పునుగు తైలాభిషేకం కూడా ఓ కారణమంటారు పండితులు. పునుగు పిల్లి చర్మంపై 10రోజులకోసారి చెమట పేరుకుపోతుంది. ఆ సమయంలో దాన్ని ఓ ఇనుప జల్లెడలో పెట్టి పక్కనే గంధపు చెక్కను ఉంచుతారు. పేరుకుపోయిన పునుగు(సుగంధ ద్రవ్యం)ని ఆ చెక్కకు రుద్దడం ద్వారా పిల్లి వదిలించుకుంటుంది. చెక్కకు బంకలా అంటుకున్న ఆ పునుగు నుంచి తీసిన తైలాన్ని శ్రీవారికి అభిషేకిస్తారు.
Similar News
News November 22, 2025
HYD: Ibomma రవిని విచారించిన సీపీ

Ibomma రవి కేసులో మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన సైబర్ క్రైమ్ ఆఫీసుకు వెళ్లి రవిని విచారించారు. పైరసీ నెట్ వర్క్, బెట్టింగ్ యాప్లతో అతనికున్న సంబంధాలు, విదేశీ కార్యకలాపాల గురించి సీపీ ఆరా తీసినట్లు సమాచారం.
News November 22, 2025
రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్ను ఇస్తుందని సూచించారు. SHARE IT
News November 22, 2025
షూటింగ్లో గాయపడిన హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్లో శ్రద్ధా నటిస్తున్నారు.


